Monday, October 11, 2010

మన శాంతమే మనకు రక్ష , Our peace is our protection



మానవ జీవితం ఒక విశిస్టమైనది . పంచభూతాలతో నిర్మితమైన ఈ జీవికి పంచావసరాలు ఉంటాయి . గాలి , నీరు , ఆహారము , నిద్ర , మైధునము . వీటిలో ఏ సమయానికి అవి ఉండాలి ... లేనిచో పలు బాధలకు లోనై మనుగడే ప్రశ్నార్ధకము . ఇవి కాకుండా అరిషట్గుణాలకు లోనవుతూ ఉంటాడు మానవుడు . కామ , క్రోధ , మోహ ,లోబ , మధ , మాత్సర్యాలు వలన విలువల్ని కోల్పోతుంటాదు .
శాంతము , క్రోధము ఒకదానికొకటి వ్యతిరేకము . ఒకటి మంచి వేరొకటి చెడు .
  • తన కోపమె తన శత్రువు,
  • తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
  • తన సంతోషమె స్వర్గము,
  • తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ
పురాణ కథలు .:
కైక తండ్రి అయిన కేకయరాజు ఒక రోజు అడవికి వెళ్ళి మగలేడిని బాణము తో కొట్టి వంపగా ... ఆడాలేడి తన తల్లికి పెప్పుకుంది . అప్పుడు ఆ తల్లి లేడి మందర అనే పేరు తో మానవ స్త్రీగా పుట్టి తన అల్లుడిని చంపాడానే క్రోధం తో (పుట్టింది గనుకనే) కైకకు దాసీ గా ఉండి మాయమాటలు చెపి కేకయరాజు యొక్క అల్లుడైన దశరధుడు చనిపోయేటట్లు చేసింది . ఈ కథ వలన తెలిసిందేమిటంటే ... ఎవరికీ విరోధులం కాకూడదు , విరోధులమయ్యే పనులు చేయకూడదూ అనే నీతిని గ్రహించాలి .
అర్జునుడు యుద్ధం లో భీష్మాచార్యుడుని చంపాడు గనుక ... భీష్ముని తల్లి గంగ కు క్రోధం కలిగింది . అర్జునుడు ఆరుమాసాలలో చచ్చుగాక అని శపించినది . జ్వాలాదేవి అర్జునుడు తన కుమారున్ని చంపాడన్న క్రోధం తో అర్జునుని కుమారుడైన బభ్రువాహనుని చేతిలో బాణం గా పుట్టి అర్జునుని తలను త్రుంచేసింది . తరువాత శ్రీకృష్నుడు అర్జునుడిని బ్రతికించాడు .

అంబ భీష్మాచార్యుల పై కోపము తో శిఖండి గా పుట్టి భీష్ముని చావుకి కారణమయినది .

శ్రీ రాముడు వాలిని చంపడం వల్ల వాలి క్రోధం తో మరుజన్మలో రాముడు ... శ్రీకృష్ణుడు గా పుట్టిన తర్వాత '' వాలి కిరాతుడిగ పుట్టి శ్రీకృష్ణుడుని బాణము తో కొట్టి చంపాడు .

పై వన్నీ క్రోధం ఫలితాలే . క్రోధం తో ఇలా మరల మరల పుడుతూ పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కంటే ... క్రోధం కలిగే పనులు చేయకుండా నుంటే ఎంతో మేలు .

  • ============================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment