Tuesday, February 18, 2014

గుర్రం గుడ్డు 'ఢాం'... మేకపిల్ల 'మే'!




రామాపురంలో ఉండే గోపాల్‌ చాలా అమాయకుడు. వాడికి నా అనేవాళ్లెవరూ లేరు. గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్‌కి అన్నం పెట్టేవారు. అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు. కానీ గోపాల్‌ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.

వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు. ఆయనకో చిన్న కొడుకున్నాడు. ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు. అంతలో అటుగా వెళుతున్న గోపాల్‌ను పిలిచారు మాష్టారు. వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు. సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు. ఆయన దగ్గరికెళ్లి 'ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?' అడిగాడు గోపాల్‌. 'ఏమో నాకు తెలీదు' అని చెప్పాడు అతను. తర్వాత గోపాల్‌ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ 'ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్‌?' అడిగాడు. 'వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే. ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే' అని మనుసులో అనుకుని 'ఇవి గుర్రం గుడ్లు బాబూ! కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి' అని చెప్పాడు.

దానికి గోపాల్‌ చాలా సంతోషించాడు. మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు' అని మనసులో అనుకుని 'దీని ధరెంత?' అడిగాడు గోపాల్‌. 'ఒక్క గుడ్డు యాభై రూపాయలు' చెప్పాడతను.

గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్‌. ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.

అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది. 'అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే' అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు. అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్‌ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు. ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు.

- కోట శ్రీదేవి@eenadu hai bujjiగుర్రం గుడ్డు 'ఢాం'... మేకపిల్ల 'మే'!
రామాపురంలో ఉండే గోపాల్‌ చాలా అమాయకుడు. వాడికి నా అనేవాళ్లెవరూ లేరు. గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్‌కి అన్నం పెట్టేవారు. అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు. కానీ గోపాల్‌ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.

వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు. ఆయనకో చిన్న కొడుకున్నాడు. ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు. అంతలో అటుగా వెళుతున్న గోపాల్‌ను పిలిచారు మాష్టారు. వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు. సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు. ఆయన దగ్గరికెళ్లి 'ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?' అడిగాడు గోపాల్‌. 'ఏమో నాకు తెలీదు' అని చెప్పాడు అతను. తర్వాత గోపాల్‌ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ 'ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్‌?' అడిగాడు. 'వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే. ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే' అని మనుసులో అనుకుని 'ఇవి గుర్రం గుడ్లు బాబూ! కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి' అని చెప్పాడు.

దానికి గోపాల్‌ చాలా సంతోషించాడు. మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు' అని మనసులో అనుకుని 'దీని ధరెంత?' అడిగాడు గోపాల్‌. 'ఒక్క గుడ్డు యాభై రూపాయలు' చెప్పాడతను.

గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్‌. ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.

అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది. 'అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే' అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు. అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్‌ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు. ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు.

- కోట శ్రీదేవి@eenadu hai bujji

============================================
 Visit my Website at - > Dr.Seshagirirao.com/

Oldman School,తాత బడి

  •  
  •  
ఆరేళ్ల నానికి తాతయ్యను చూడాలని కోరిక. అమ్మని, నాన్నని అడిగితే తాతయ్య పుట్టిన రోజు నాడు వెళదామని నచ్చజెప్పారు. తాతయ్య పుట్టిన రోజు రానే వచ్చింది. ఉదయం నుంచి నాని హడావుడి ఎక్కువయింది. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు. అమ్మ, నాన్న, నాని కారులో బయలుదేరారు.

'తాతయ్యకి డెబ్బయ్యేళ్లు. ఆయన ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నారు. ఒంటరిగా ఆశ్రమంలో ఉంటున్నారు. నీకు మంచి మంచి కథలు చెపుతారు' నానికి చెప్పాడు నాన్న.
ఆశ్రమానికి చేరారు. నానిని చూడగానే తాతయ్య నవ్వుతూ 'బంగారుకొండా! రారా!' అంటూ దగ్గరికి తీసుకుని ముఖాన్ని ముద్దులతో నింపేశాడు. నానికి ఒళ్లు పులకించింది. తాతయ్యను ముద్దు పెట్టుకున్నాడు.

నానిని తన గదిలోకి తీసుకుపోయాడు తాతయ్య. బోలెడు బొమ్మలు, బొమ్మల పుస్తకాలు చూపించాడు. పళ్లెంలో ఉన్న రకరకాల పండ్లు చూపించి 'నీకు కావల్సినవి తీసుకో' అన్నాడు.
తరువాత నానిని భుజాల మీద కూర్చోబెట్టుకుని తోటలోకి తీసుకుపోయి చెట్లు, పిట్టలు చూపించాడు. చెట్ల కథలు, పిట్టల కథలు చెప్పాడు. ఆకాశంలోని మబ్బులు చూపించాడు. మబ్బుల ఆకారాలను చూపించి పాటలు పాడాడు. నానితో పాడించాడు. గాజు తొట్టెలోని రంగురంగుల చేపలను చూపిస్తుంటే, అవి నీటిలో ఈదుతూ ఉంటే చూసి మురిసిపోయాడు నాని.

వాళ్లలా కాసేపు తోటలో దాగుడుమూతలు ఆడారు. దొంగా పోలీసు ఆట ఆడారు. పరుగు పందెంలో నాలుగుసార్లు నాని గెలిచాడు. విజయగర్వంతో గంతులేశాడు నాని.
మధ్యాహ్నం తాతయ్య పుట్టినరోజు కేకుకోసి, నానికి తినిపించాడు. తాతయ్య ఒక బొమ్మల పుస్తకం నానికి బహుమతిగా ఇచ్చాడు. దానిని అపురూపంగా చూసుకున్నాడు నాని. జేబులోంచి కొత్త పదిరూపాయిల నోటు తీసి ఇచ్చి 'ఇది నా గుర్తుగా ఉంచుకో' అన్నాడు తాతయ్య. నాని ఆనందానికి అంతులేదు.

భోజనాలు చేశాక అమ్మ, నాన్నతో కలిసి నాని బయలుదేరాడు. 'తాతయ్యా! నువ్వు నాకు నచ్చావు' అన్నాడు నాని. 'మనవడా! ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు' 'నా పేరు నాని, తాతయ్య, నీ పేరు?' అన్నాడు నాని.'నా పేరు తాతయ్యే' అంటూ ముసిముసిగా నవ్వాడు. 'తాతయ్యా! నీ పుట్టిన రోజు బాగా జరిగింది కదా!' 'అవును నానీ! రేపు నీలాంటి మరొక మనవడు వస్తాడు. ఇలా ప్రతిరోజూ నాకు పుట్టినరోజే!' అన్నాడు తాతయ్య. తను నడుపుతున్న 'తాతబడి' అనే వృద్ధాశ్రమం నుంచి వెళ్లిపోతున్న నానిని చూస్తూ, చెమర్చిన కళ్లు తుడుచుకున్నాడు తాతయ్య.

  • - చొక్కాపు వెంకటరమణ@eenadu hai bujji
  • ============================================