Tuesday, February 18, 2014

గుర్రం గుడ్డు 'ఢాం'... మేకపిల్ల 'మే'!




రామాపురంలో ఉండే గోపాల్‌ చాలా అమాయకుడు. వాడికి నా అనేవాళ్లెవరూ లేరు. గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్‌కి అన్నం పెట్టేవారు. అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు. కానీ గోపాల్‌ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.

వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు. ఆయనకో చిన్న కొడుకున్నాడు. ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు. అంతలో అటుగా వెళుతున్న గోపాల్‌ను పిలిచారు మాష్టారు. వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు. సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు. ఆయన దగ్గరికెళ్లి 'ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?' అడిగాడు గోపాల్‌. 'ఏమో నాకు తెలీదు' అని చెప్పాడు అతను. తర్వాత గోపాల్‌ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ 'ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్‌?' అడిగాడు. 'వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే. ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే' అని మనుసులో అనుకుని 'ఇవి గుర్రం గుడ్లు బాబూ! కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి' అని చెప్పాడు.

దానికి గోపాల్‌ చాలా సంతోషించాడు. మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు' అని మనసులో అనుకుని 'దీని ధరెంత?' అడిగాడు గోపాల్‌. 'ఒక్క గుడ్డు యాభై రూపాయలు' చెప్పాడతను.

గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్‌. ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.

అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది. 'అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే' అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు. అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్‌ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు. ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు.

- కోట శ్రీదేవి@eenadu hai bujjiగుర్రం గుడ్డు 'ఢాం'... మేకపిల్ల 'మే'!
రామాపురంలో ఉండే గోపాల్‌ చాలా అమాయకుడు. వాడికి నా అనేవాళ్లెవరూ లేరు. గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్‌కి అన్నం పెట్టేవారు. అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు. కానీ గోపాల్‌ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.

వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు. ఆయనకో చిన్న కొడుకున్నాడు. ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు. అంతలో అటుగా వెళుతున్న గోపాల్‌ను పిలిచారు మాష్టారు. వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు. సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు. ఆయన దగ్గరికెళ్లి 'ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?' అడిగాడు గోపాల్‌. 'ఏమో నాకు తెలీదు' అని చెప్పాడు అతను. తర్వాత గోపాల్‌ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ 'ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్‌?' అడిగాడు. 'వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే. ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే' అని మనుసులో అనుకుని 'ఇవి గుర్రం గుడ్లు బాబూ! కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి' అని చెప్పాడు.

దానికి గోపాల్‌ చాలా సంతోషించాడు. మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు' అని మనసులో అనుకుని 'దీని ధరెంత?' అడిగాడు గోపాల్‌. 'ఒక్క గుడ్డు యాభై రూపాయలు' చెప్పాడతను.

గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్‌. ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.

అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది. 'అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే' అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు. అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్‌ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు. ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు.

- కోట శ్రీదేవి@eenadu hai bujji

============================================
 Visit my Website at - > Dr.Seshagirirao.com/

Oldman School,తాత బడి

  •  
  •  
ఆరేళ్ల నానికి తాతయ్యను చూడాలని కోరిక. అమ్మని, నాన్నని అడిగితే తాతయ్య పుట్టిన రోజు నాడు వెళదామని నచ్చజెప్పారు. తాతయ్య పుట్టిన రోజు రానే వచ్చింది. ఉదయం నుంచి నాని హడావుడి ఎక్కువయింది. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు. అమ్మ, నాన్న, నాని కారులో బయలుదేరారు.

'తాతయ్యకి డెబ్బయ్యేళ్లు. ఆయన ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నారు. ఒంటరిగా ఆశ్రమంలో ఉంటున్నారు. నీకు మంచి మంచి కథలు చెపుతారు' నానికి చెప్పాడు నాన్న.
ఆశ్రమానికి చేరారు. నానిని చూడగానే తాతయ్య నవ్వుతూ 'బంగారుకొండా! రారా!' అంటూ దగ్గరికి తీసుకుని ముఖాన్ని ముద్దులతో నింపేశాడు. నానికి ఒళ్లు పులకించింది. తాతయ్యను ముద్దు పెట్టుకున్నాడు.

నానిని తన గదిలోకి తీసుకుపోయాడు తాతయ్య. బోలెడు బొమ్మలు, బొమ్మల పుస్తకాలు చూపించాడు. పళ్లెంలో ఉన్న రకరకాల పండ్లు చూపించి 'నీకు కావల్సినవి తీసుకో' అన్నాడు.
తరువాత నానిని భుజాల మీద కూర్చోబెట్టుకుని తోటలోకి తీసుకుపోయి చెట్లు, పిట్టలు చూపించాడు. చెట్ల కథలు, పిట్టల కథలు చెప్పాడు. ఆకాశంలోని మబ్బులు చూపించాడు. మబ్బుల ఆకారాలను చూపించి పాటలు పాడాడు. నానితో పాడించాడు. గాజు తొట్టెలోని రంగురంగుల చేపలను చూపిస్తుంటే, అవి నీటిలో ఈదుతూ ఉంటే చూసి మురిసిపోయాడు నాని.

వాళ్లలా కాసేపు తోటలో దాగుడుమూతలు ఆడారు. దొంగా పోలీసు ఆట ఆడారు. పరుగు పందెంలో నాలుగుసార్లు నాని గెలిచాడు. విజయగర్వంతో గంతులేశాడు నాని.
మధ్యాహ్నం తాతయ్య పుట్టినరోజు కేకుకోసి, నానికి తినిపించాడు. తాతయ్య ఒక బొమ్మల పుస్తకం నానికి బహుమతిగా ఇచ్చాడు. దానిని అపురూపంగా చూసుకున్నాడు నాని. జేబులోంచి కొత్త పదిరూపాయిల నోటు తీసి ఇచ్చి 'ఇది నా గుర్తుగా ఉంచుకో' అన్నాడు తాతయ్య. నాని ఆనందానికి అంతులేదు.

భోజనాలు చేశాక అమ్మ, నాన్నతో కలిసి నాని బయలుదేరాడు. 'తాతయ్యా! నువ్వు నాకు నచ్చావు' అన్నాడు నాని. 'మనవడా! ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు' 'నా పేరు నాని, తాతయ్య, నీ పేరు?' అన్నాడు నాని.'నా పేరు తాతయ్యే' అంటూ ముసిముసిగా నవ్వాడు. 'తాతయ్యా! నీ పుట్టిన రోజు బాగా జరిగింది కదా!' 'అవును నానీ! రేపు నీలాంటి మరొక మనవడు వస్తాడు. ఇలా ప్రతిరోజూ నాకు పుట్టినరోజే!' అన్నాడు తాతయ్య. తను నడుపుతున్న 'తాతబడి' అనే వృద్ధాశ్రమం నుంచి వెళ్లిపోతున్న నానిని చూస్తూ, చెమర్చిన కళ్లు తుడుచుకున్నాడు తాతయ్య.

  • - చొక్కాపు వెంకటరమణ@eenadu hai bujji
  • ============================================ 

Sunday, November 3, 2013

Bali king,Mahabali , మహాబలిల్,బలి చక్రవర్తి




భారతదేశవ్యాప్తంగా పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది. మెదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి.

మహా బలికి స్వాగతం 'ఓనం'
చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా మరియు సిరిసంపదలతో ఉన్నారు మరియు ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. తన సుగుణములన్నింటితోపాటు, మహాబలికి ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు.
బలి చక్రవర్తి  ఏడాదికోమారు భూలోకానికి వచ్చి, తన ప్రజలందరి యోగక్షేమాలు తెలుసుకుంటాడని జన విశ్వాసం. కేరళలో బలి ఆగమనానికి గుర్తుగా 'ఓనం' పండుగ జరుపుకుంటారు. మలయాళీయుల పంచాంగం ప్రకారం తొలిమాసమైన 'చింగం (ఆగస్టు-సెప్టెంబర్‌ల నడుమ)'లో ఓనం వస్తుంది. ఈ పండుగ పదిరోజులపాటు కొనసాగుతుంది. చిక్కని పువ్వుల రంగవల్లులు,  పసందైన విందు భోజనం, కొత్త బట్టలు, ఆటపాటల కోలాహలంతో ఈ పదిరోజులు కేరళ అంతా సందడిగా ఉంటుంది. దేశ విదేశాల్లో ఉన్న మలయాళీయులుసైతం తమ తమ ప్రాంతాల్లోనే ఈ పండుగ జరుపుకుంటారు.

అహంకారాన్ని అణచిన త్రివిక్రముడు
పురాణకథనాల ప్రకారం, బలి చక్రవర్తి రాక్షసుడైనప్పటికీ జనరంజకంగా పాలించేవాడు. మహాదాత. ఆయన పాలనలో జనులు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించేవారు. అయితే బలికి అహంకారం పెరగసాగింది. స్వర్గాధిపత్యం సాధించి ఇంద్ర పదవి పొందాలన్న ఆశతో మహా క్రతువు తలపెట్టాడు. అర్హతలేకుండా అందలం ఆశించడంతో శ్రీమహావిష్ణువు వామనావతారం దాల్చి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. క్రతువు జరుగుతుండగా యాగశాలకు వటువు రూపంలో విష్ణుమూర్తి వచ్చి, మూడడుగులు దానమడుగుతాడు. కులగురువైన శుక్రాచార్యుడు అడ్డుకున్నప్పటికీ బలి చక్రవర్తి దానం ఇవ్వడానికే సిద్ధపడతాడు.
దానం అందుకోగానే వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా భూమ్యాకాశాలను రెండు అడుగులతో ఆక్రమిస్తాడు. మూడో అడుగు ఎక్కడ మోపాలని అడగ్గా, తన శిరస్సు చూపుతాడు బలి. విష్ణువు ఆ విధంగా బలిని పాతాళానికి పంపుతాడు. అయితే బలి చక్రవర్తి పాలనాపరంగా పుణ్యాత్ముడు కావడంతో అతనినే పాతాళ చక్రవర్తిగా నియమిస్తాడు. ఏడాదికోమారు భూమిపైకి వచ్చి తన ప్రజలను పలకరించే వరాన్నికూడా ప్రసాదించాడు విష్ణుమూర్తి. అలాగే బలి ఆశించినట్టుగానే అతనికి  ఇంద్ర పదవి దక్కే అవకాశాన్ని ఎనిమిదో మన్వంతరంలో కల్పించాడు.

పసందైన ఓనసద్య
మహాబలి భూమికి వచ్చే పర్వదినాలే ఓనం. ఓనంకు పది రోజుల ముందునుంచే కేరళలోని ప్రతి ముంగిలి రంగవల్లులతో కళకళలాడడం  అనవాయితీ. బలి చక్రవర్తిని ఆహ్వానించడంలో భాగంగా 'ఓనపూక్కలం' పేరుతో పువ్వులతో రంగోలి అమరుస్తారు. బలి ప్రతి ఇంటికీ వచ్చి యోగక్షేమాలు కనుక్కుంటాడని ప్రజల నమ్మకం. తిరుఓనం నాడు 11 నుంచి 13 రకాల ఆహార పదార్థాలతో అరటి ఆకులలో  'ఓనసద్య విందు' చేస్తారు.

త్రివిక్రముడికి ప్రత్యేక పూజలు
ఓనం రోజులలో కేరళలోని త్రిక్కకరలోగల వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ తమ ఇళ్లలో త్రిక్కకర అప్పన్‌ (వామనుడు) విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. ఓనం పండుగ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళ పడవ పందాలు నిర్వహిస్తారు. సర్పాకారంతో తయారుచేసిన పడవలపై 100మంది వరకూ నావికులు కూర్చుని పంపానదిలో పోటీకి దిగుతారు.

పురాణం

మహాబలి ప్రహ్లాదుని మనుమడు.విరోచనుడు ని కొడుకు. ప్రహ్లాదుడు అసురుడైనప్పటికీ, విష్ణువు పైన గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. మహాబలి చిన్నపిల్లవాడుగా ప్రహ్లాదుని ఒడిలో ఉండగానే విష్ణువుపైన ప్రేమను మరియు భక్తిని అలవరుచుకున్నాడు.

మహాబలి ముల్లోకములను జయించుట

కశ్యపుడుకి ఇద్దరు భార్యలు, దితి మరియు అదితి, వీరు రాక్షసులు మరియు దేవతల (అసురులు మరియు దేవతలు) తల్లితండ్రులు. తపస్సు చేసుకోవటానికి హిమాలయములకు వెళ్ళిన కశ్యపుడు, తిరిగి వచ్చి అదితి శోకిస్తూ ఉండటాన్ని కనుగొంటాడు. దివ్య దృష్టితో కశ్యపుడు వెంటనే ఆమె బాధకు కారణమును కనుగొంటాడు. ఈ ప్రపంచములో దేవుని ఇష్టం లేకుండా ఏదీ జరగదనీ మరియు ప్రజలు వారి విధులు నిర్వర్తిస్తూ ఉండాలని చెపుతూ ఆయన, ఆమెను సమాధాన పరచటానికి ప్రయత్నించాడు. ఆయన, ఆమెకు విష్ణునును పూజించమని చెపుతూ పయోవ్రతమును బోధించాడు, ఇది కార్తీక మాసము యొక్క శుక్ల పక్షములో పన్నెండవ రోజు (శుక్ల-పక్ష ద్వాదశి) నుండి చేయవలసిన క్రతువు. అదితి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించటం వలన, విష్ణువు ఆమెకు దర్శనమిచ్చి తను ఇంద్రునికి సహాయం చేస్తానని ఆమెకు తెలియజేసాడు.

ఇంకొక ప్రక్క, దేవతలను ఓడించి మహాబలి ముల్లోకములకు పాలకుడు అవటంతో దేవతలందరూ చాలా చిరాకు పడ్డారు. దేవతలు హింసించబడ్డారు. దేవతలు విష్ణువును కలిసి సహాయం అర్ధించారు. మహాబలి తన ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు మరియు అతను సురుడు (దేవుడు) అవటానికి అర్హుడు అని విష్ణువు దేవతలతో చెప్పాడు. దేవతలారా మీరు దీని గురించి ఈర్ష్య చెందకండి. అసూయ మిమ్ములను అసురులుగా చేస్తుంది. విష్ణువు మహాబలిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు.

అదే సమయంలో, మహాబలి నర్మదా నది ఒడ్డున విశ్వజిత్ యాగం లేదా అశ్వమేధ యాగం నిర్వర్తిస్తున్నాడు. ఈ యాగం సమయంలో తన వద్ద నుండి ఎవరు ఏమి కోరినా అది తను ఇస్తానని కూడా ఆయన ప్రకటించాడు.
వామనుడు మహాబలిని కలుస్తాడు
బలి చక్రవర్తి (మహాబలి, right seated) ఆస్థానములో భిక్ష కోరుతున్న వామనుడు (నీల వర్ణపు మోము కలిగిన పొట్టివాడు).

ఆ యాగమును మరియు మహాబలి యొక్క ప్రకటనను అదునుగా తీసుకుని, వామనుడు (మహావిష్ణువు బ్రాహ్మణుడిగా మారువేషంలో) ఆ యాగశాల వద్దకు వచ్చాడు. అతను వారిని సమీపించగానే, అక్కడ ఉన్న ఋషులు ఆ చిన్నపిల్లవాని యొక్క దివ్యమైన తేజస్సును కనుగొన్నారు. మహాబలి ఆ బ్రాహ్మణ బాలుని సకల మర్యాదలతో స్వాగతించాడు మరియు ఒక దివ్య పురుషుని హోదాలో అతనిని ఉన్నతాసనములో కూర్చుండబెట్టాడు. సహాయం కోరుతూ వచ్చిన ప్రజలకు ఇచ్చే సాధారణ మర్యాదతో మహాబలి, వామనునితో ఆయన రాకతో తనను పావనం చేయటం తన అదృష్టమని చెప్పాడు. వామనుడు ఏది కోరుకుంటే, అది తీర్చటానికి మహాబలి సిద్ధంగా ఉన్నాడు. వామనుడు చిరునవ్వు నవ్వి ఈవిధంగా చెప్పాడు: "నువ్వు నాకు గొప్పది ఏదీ ఇవ్వనక్కరలేదు. నువ్వు నాకు మూడు అడుగుల భూమిని ఇస్తే చాలు" .

అతని మాటలు విని, భవిష్యత్తును చూడగలిగిన, మహాబలి యొక్క గురువు అయిన శుక్రాచార్యుడు అనే బ్రాహ్మణుడు (ఒక దైత్య గురువు), మహాబలితో అతని వద్దకు భిక్ష కొరకు వచ్చిన వాడు సాధారణ బ్రాహ్మణుడు కాదని విష్ణువే ఈ రూపంలో వచ్చాడని చెప్పాడు. ఆ పిల్లవానికి ఏమీ వాగ్దానం చేయవద్దని ఆయన మహాబలికి సలహా ఇచ్చాడు. కానీ మహాబలి ఎప్పుడూ ఆడిన మాట తప్పే రాజు కాదు, అలా చేయటం పాపమని ఆయన ఉద్దేశ్యం. వామనుని కోరికలను తీర్చకూడదని, ఎందుకనగా వామనుడు అతని సంపదనంతటినీ హరించివేస్తాడని శుక్రాచార్యుడు గట్టిగా చెప్పాడు.
సాంప్రదాయక దుస్తులలో ఉన్న ఒనపొట్టాన్, కేరళ ఉత్తర ప్రాతములలో ఒక ఆచారంఓనం సమయంలో ఒనపొట్టాన్ ఇంటింటికీ తిరిగి దీవెనలు అందిస్తాడు. ప్రస్తుతం ఒనపొట్టాన్ చాలా అరుదుగా అగుపిస్తున్నాడు, కేవలం గ్రామాలకే పరిమితమైనాడు.

వామనుడుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్న మహాబలి, తన గురువు మాటను మన్నించనందుకు ఆయనను క్షమాపణ కోరుకున్నాడు. పూర్వం, మహాబలి ఇంద్రునిపై యుద్ధానికి దండెత్తి వెళుతున్నప్పుడు, తన గురువైన శుక్రాచార్యుని కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసాడు మరియు ఆయన సలహాపైనే విశ్వజిత్ యాగమును ప్రారంభించాడు, దీని నుండే అతను కొన్ని శక్తివంతమైన ఆయుధాలను సంపాదించాడు. కేవలం శుక్రాచార్యుని సహాయం వలనే అతను ఇంద్రుడిని జయించగలిగాడు. మహాబలి తిరస్కారం శుక్రాచార్యునికి ఆగ్రహం తెప్పించింది. ఆయన మహాబలిని ఈవిధంగా శపించాడు: 'నీ గురువు మాటలను లక్ష్య పెట్టనందుకు, నీవు బూడిద అయిపోతావు'. మహాబలి ధృడంగా ఉండి ఈ విధంగా సమాధానం చెప్పాడు: 'నేను ఏ విధమైన పరిణామములను ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ నా మాటను వెనక్కి తీసుకోను'.
మహాబలి యొక్క ఏలుబడి ముగుస్తుంది

ఆ విధంగా చెపుతూ, అతను వామనుడుని అతను కోరుకున్న మూడు అడుగుల భూమిని కొలవమని అడిగాడు. మహాబలిని వారించటానికి శుక్రాచార్యుడు చేసిన ప్రయత్నములన్నీ విఫలమయ్యాయి. తన వద్దకు సహాయం కొరకు వచ్చిన ప్రతిఒక్కరినీ దేవునిగానే మహాబలి భావించాడు మరియు వారు కోరినది ఏదీ అతను కాదనలేదు. మహాబలి తన గురువుతో ఈ విధంగా చెప్పాడు: "ప్రాణము (జీవం) మరియు మానము (మర్యాద) అనేవి మనిషికి రెండు కళ్ళ వంటివి. ప్రాణం పోయినా, మానం రక్షించబడాలి. ఇప్పుడు వచ్చిన వాడు దేవుడే అని తెలుసుకుంటే, మానవులకు అన్నీ ఇచ్చే భగవంతుడు, నా నుండి ఏదో ఆశిస్తున్నాడంటే, నేను చాలా అదృష్టవంతుడిని అవుతాను. " ఒకవేళ విష్ణువే తన క్రతువు వద్దకు వచ్చి ఏదైనా కోరుకుంటే, తను తప్పకుండా దానిని తీరుస్తానని కూడా మహాబలి గొప్పగా చెప్పాడు.

బలిపై విజయం సాధించిన త్రి-విక్రమునిగా (ముల్లోక విజేత) వామనుడు
వామనుడు ఆకాశము కన్నా ఎత్తుకు పెరిగిపోయాడు. ఒక్క అడుగుతో, అతను భూమినంతటినీ కొలిచాడు. రెండవదానితో ఆకాశమును కొలిచాడు. మహాబలి అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఇంకొక అడుగు భూమి ఇంకా మిగిలి ఉంది. వేరే దారి లేకపోవటంతో, మూడవ అడుగు భూమిగా ఆఖరి అడుగును తన తలపై ఉంచవలసిందని మహాబలి వామనుడిని అభ్యర్ధించాడు. వామనుడు అదే విధంగా చేస్తూ, అతనిని పాతాళానికి తొక్కి వేసాడు
(భూమి క్రింద ఉన్న రాజ్యం).--విష్ణువు యొక్క దీవెనలు
రాక్షసుడు అయిన మహాబలి భక్తికి మెచ్చి, విష్ణువు (వామనుడు) అతనికి పాతాళమును పాలించే వరం ఇచ్చాడు. ఒక మన్వంతరం అతను ఇంద్ర పదవిని అధిష్టించే వరం కూడా ఇచ్చాడు, ఆ విధంగా తన భక్తుని కోరికను నెరవేర్చాడు (ప్రతి మన్వంతరమునకు ఒకసారి ఇంద్ర పదవిని కొత్తవారు అధిష్టిస్తారు).

ఆఖరి వరంగా, మహాబలి సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను కలుసుకునేందుకు అనుమతి కూడా పొందాడు. ఆవిధంగా, తన వాగ్దానమును నిలుపుకోవటానికి ప్రతి సంవత్సరము వచ్చే గొప్ప రాజు మహాబలి జ్ఞాపకార్ధం కేరళ ప్రజలు ఓనం పండుగను జరుపుకుంటారు. ఆడిన మాట ("సత్యము") కొరకు ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా మహాబలి తన పేరును సార్ధకం చేసుకున్నాడు. "మహాబలి" అనగా గొప్ప త్యాగము అని అర్ధం.

ఓనం సమయంలో, విందు మరియు చక్కగా ముస్తాబైన ప్రజల యొక్క పండుగ ఉత్సాహం మహాబలి యొక్క మచ్చలేని పాలన సమయంలోని ప్రజల సుసంపన్నమైన మరియు నిజాయితీ అయిన జీవితానికి స్మృతిగా భావిస్తారు. ఓనం సమయంలో ప్రజలు కొత్త దుస్తులు (వస్త్రములు) ధరిస్తారు. 'వస్త్రము' అనగా హృదయము అని కూడా అర్ధం. ఆవిధంగా చెడ్డ ఆలోచనలను మరియు చెడ్డ భావములను తొలగించి హృదయమును నూతనముగా చేయటమే, కొత్త వస్త్రములు ధరించటం యొక్క ప్రాముఖ్యత. వారి మత అభిమానములను ప్రక్కన పెట్టి, ప్రజలందరూ కలిసికట్టుగా పవిత్రమైన 'తిరుఓనం' దినానికి స్వాగతం చెపుతారు.

నైతిక ప్రశ్నలు
తన తాత (ప్రహ్లాదుడు) లాగా, విష్ణువుకు గొప్ప భక్తులలో ఒకడు మరియు సత్యసంధుడైన ఒక గొప్ప రాజు అయిన మహాబలిని, విష్ణువు శిక్షించటం అన్యాయముగా అనిపించవచ్చు. అయినప్పటికీ, విష్ణువు మహాబలిని శిక్షించినట్లు కాదు, ఎందుకనగా అతను విష్ణువు నుండి వరములు పొందాడు మరియు ఓనం రూపంలో అతను శాశ్వతంగా గుర్తుంచుకోబడతాడు. ఇంకా అతని తన తలను విష్ణువు పాదముల క్రింద ఉంచే అవకాశం దొరికింది, దీనితో అతని పాపములు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి.

ఇంకా, విష్ణువు ఇచ్చిన వరం వలన, మహాబలి ఎనిమిదవ మనువు, సావర్ణి మనువు సమయంలో, కాబోయే (ఎనిమిదవ) ఇంద్రుడు. పురందరుడు ప్రస్తుత ఇంద్రుడు.

తన రాజ్యమును విష్ణువుకు త్యాగం చేయటం ద్వారా మహాబలి భూమండలంలో అతి గొప్ప విష్ణు భక్తుడు అయినాడని నమ్మకం.

సురలు అనగా మంచివారు మరియు అసురులు అనగా చెడ్డవారు అని అర్ధం. హిందూమతం ప్రకారం, చెడ్డ పనులు చేయటం ద్వారా సురలు అసురులు అవవచ్చు మరియు మంచి పనులు చేయటం ద్వారా అసురులు సురలు అవవచ్చు. అసురుడైన మహాబలి, సురుడు అవాలని కోరుకున్నాడు. దాని కొరకు, అతను తన ప్రజలకు మంచి పనులు చేసాడు. మహాబలి యొక్క పరోపకారమును మరియు దాతృత్వమును పరీక్షించటానికి మహావిష్ణువు వామనుని రూపంలో వచ్చి అతనిని పాతాళమునకు పంపివేసాడు, దీనిని మహాబలి ఆనందముగా స్వీకరించాడు. ఆవిధంగా, మహాబలి సురుడు లేదా దేవుడు అయినాడు మరియు ఓనం హిందూమతం యొక్క అద్వైత సిద్ధాంతమును దృష్టాంతపరుస్తోంది.
-----------------------------

రాక్షస రాజైన బలి చక్రవర్తి ఓసారి భూమిని ఆక్రమిస్తాడు. దానవుల నుంచి మనుషులను కాపాడటానికి విష్ణుమూర్తి వైకుంఠాన్ని, లక్ష్మీదేవిని వదిలి భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణపౌర్ణమి రోజు బలి చక్రవర్తి చేతికి పవివూతదారాన్ని కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మనుషులకు విముక్తి కలిగిస్తాడు. విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.
  • =====================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/

Saturday, November 2, 2013

Pot desire - కుండ కోరిక

  •  

  •  

కుండ కోరిక

కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు. ఓర్పుతో, నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు. అప్పటికే కాలుతున్న కొన్ని కుండలని చూసి పచ్చి కుండల్లో ఒకదానికి చాలా భయం వేసింది. 'అమ్మో! ఒళ్లు కాలిపోవడమే? వద్దు. దయచేసి నన్ను కాల్చొద్దు. నన్నిలా వదిలెయ్‌. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు. నాకు భయంగా ఉంది' అని కుమ్మరిని దీనంగా బతిమాలింది. కుమ్మరి కుండతో 'జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృథా అవుతుంది. సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావు' అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు. అతడు ఎంత చెప్పినా వినకుండా కుండ మొండికేసింది. సరే... అంతలా అడుగుతోంది పోనిమ్మని కుమ్మరి ఈ కుండని వదిలేసి మిగిలిన కుండలను ఆవంలో పెట్టాడు. ఆవంలో కాలుతున్న కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు, ఆనంద పడుతూ, 'నాకా బాధలు లేవు, హాయిగా ఉన్నాను' అనుకుంది ఆ పచ్చి కుండ. బాగా కాలిన ఎర్రని, నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చి కుండ మాత్రం ఆరుబయట ఆవరణలో అలా ఉండిపోయింది. కుమ్మరి ఒక కుండలో నీళ్లు నింపాడు. కొన్ని కుండీలలో మట్టి నింపి మొక్కలు నాటాడు. తనకా బరువులు లేనందుకు ఆనందించిందా పచ్చి కుండ. ఇలా ఉండగా ఓ రోజు కుండపోతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలూ, కుండీలూ దృఢంగా అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లిగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. తన ఆకృతిని, ఉనికిని కోల్పోయింది. కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి చివరిక్షణంలో బోధపడింది. కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది.
- గుడిపూడి రాధికారాణి


  • =====================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/

Wednesday, October 13, 2010

ఆభరణం ఎవరిది?తెలుసుకోవడం ఎలా ?, How to know the looser?




సిరిపురం శివాలయంలోని వటవృక్షం కింద ఓ సాధువు, తన శిష్యుడితో బస చేశాడు. రోజూ సాయంత్రం ఆలయానికి వచ్చే భక్తులకు పురాణ పఠనం చేస్తూ ప్రసంగాలు ఇవ్వసాగాడు.

ఓరోజు భక్తులందరూ వెళ్లిపోయిన తర్వాత ఆవరణను శుభ్రం చేస్తున్న శిష్యుడికి చీకట్లో ఏదో తళతళలాడుతూ కనిపించింది. దీపం వెలుగులో చూసేసరికి అదొక బంగారు హారం. శిష్యుడు దాన్ని గురువుకి చూపించాడు.

'ఎవరో భక్తురాలు పోగొట్టుకుని ఉంటుంది. రేపు అందజేద్దాం' అన్నాడు సాధువు.

'అంతమందిలో దీన్ని పోగొట్టుకున్నదెవరో తెలుసుకోవడం ఎలా స్వామీ?' అన్నాడు శిష్యుడు. సాధువు నవ్వి ఊరుకున్నాడు. మర్నాడు ప్రసంగం పూర్తవగానే సాధువు, 'భక్తులారా! నిన్న ఇక్కడెవరో ఓ విలువైన బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్నారు. పరిశీలించి చూడగా ఆ వ్యక్తి తీవ్రమైన గ్రహదోషంతో ఉన్నట్టు నా దివ్యదృష్టికి గోచరించింది. ఆ దోషం పోవాలంటే సుమారు యాభై వేల వరహాలు ఖర్చు చేసి యాగం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి వస్తే ఆ యాగాన్ని నేనే నిర్వహించగలను' అంటూ జోలెలో దాచిన ఆభరణాన్ని పైకి తీసి చూపించాడు.

భక్తులందరూ దాన్ని చూశారు. ఇంతలో ఓ మహిళ కంగారుగా సాధువు దగ్గరకి వచ్చి, 'స్వామీ! అది నాదే. నగ సంగతలా ఉంచి నా గ్రహదోషం పోవడానికి చేసే ఆ యాగానికి ఏం కావాలో సెలవీయండి' అంది.

సాధువు ఆమెను భక్తులంతా వెళ్లిపోయే వరకూ వేచి ఉండమని చెప్పి ఆభరణాన్ని ఇచ్చేశాడు. ఆపై కాసేపు కళ్లు మూసుకుని ధ్యానించి, 'నువ్వేమీ కంగారు పడకమ్మా! నీ గ్రహస్థితి మారింది. నువ్వే యాగాలూ చేయక్కర్లేదు' అన్నాడు. ఆమె సంబరంగా వెళ్లిపోయింది.

శిష్యుడు ఆశ్చర్యంగా సాధువుని సమీపించి, 'అదేంటి స్వామీ! యాభై వేల వరహాల యాగం చేయక తప్పదని చెప్పిన గ్రహస్థితి ఒక్కసారిగా ఎలా మారిపోతుంది?' అన్నాడు.

సాధువు నవ్వి, 'బంగారం ఆశను రేకెత్తిస్తుంది నాయనా! ఇదెవరిదో చెప్పండంటే చాలా మంది నాదంటే నాదని ఎగబడేవారు. అందుకే పదివేల వరహాల ఆభరణానికి యాభై వేల యాగాన్ని అడ్డం వేశాను. ఆ నగ నిజంగా ఎవరిదో తెలుసుకోడానికే అలా చెప్పాను' అన్నాడు సాధువు నవ్వుతూ.
- ఆరుపల్లి గోవిందరాజులు


  • ============================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/

చంద్రుడు--పదహారు కళలు , Moon and sixteen colors





చంద్రుడు దేవతలందరిలోకీ అందగాడు. చల్లని వాడు. పదునాలుగు లోకాల వారికీ ఇష్టుడు.
అశ్విని మొదలైన ఇరవై ఏడుగురు నక్షత్ర కన్యలు దక్షప్రజాపతి కుమార్తెలు. వాళ్లందరూ అందగత్తెలే.
వాళ్లందరినీ దక్షుడు చంద్రుడికిచ్చి వివాహం కావించాడు. చంద్రుడు వాళ్లందరినీ అనురాగంతోనే చూశాడు. కానీ, రోహిణిపైన మాత్రం కొంచెం ఎక్కువ స్నేహం కనబరిచాడు. అదిచూసి మిగతా వారు అసూయ చెంది, లోలోపల కుమల సాగారు. వారందరూ కలిసి పుట్టింటికి వెళ్లి తమ దౌర్భాగ్యాన్ని తండ్రితో చెప్పుకొని కంటనీరు పెట్టుకున్నారు. దక్షుడు వారి పట్ల జాలిపడి, చంద్రుణ్ని తన ఇంటికి పిలిచి తన కుమార్తెలందరిపట్ల సమానమైన ఆదరం కనబరచవలసిందని హితవు చెప్పి పంపాడు. కానీ చంద్రుడు తన పక్షపాతాన్ని మానుకోలేకపోయాడు.
దక్షుడు ఆగ్రహం చెంది, అల్లుడని కూడా ఆలోచించక, చంద్రుడికి క్ష్యయవ్యాధి కలగాలని శపించాడు. ఆ కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించిపోసాగాడు. అతని నుండి వెన్నెల వర్షించటం ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. రాత్రులు గాఢాంధకారంతో నిండి, భయంకరంగా మారాయి. ఆ చీకటిలో రాత్రించరులైన రాక్షసులు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభించారు. లోకాలకు ఉల్లాసం కలిగించే చంద్రుడు అలా నానాటికీ కృశించిపోవటం చూసి ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు దుఃఖించి, చంద్రుణ్ని పిలుచుకొని బ్రహ్మ వద్దకు వెళ్లి, చంద్రుడికి రోగ విముక్తి కలిగించమని ప్రార్థించారు. బ్రహ్మ చంద్రుడితో, 'సుధాకరా! నువ్వు ప్రభాస క్షేత్రానికి వెళ్లి మృత్యుంజయుడైన పరమ శివుణ్ని గూర్చి తపస్సు చెయ్యి. దానివల్ల నీ క్షయవ్యాధి పోయి విశ్వశాంతి ఏర్పడగలదు' అన్నాడు.
చంద్రుడు బ్రహ్మ చెప్పిన విధంగా ఆరు మాసాలపాటు తపస్సు చేశాక, ఈశ్వరుడు భవానీ సమేతంగా ప్రత్యక్షమై, 'వత్సా! దక్షశాపం వల్ల కృశించిపోతున్నానని విచారపడకు. నీకు కృష్ణ పక్షంలో ప్రతిరోజూ ఒక్కొక్క కళ క్షీణిస్తుంది. ఈ విధంగా నువ్వు నెలకొకసారి పూర్ణ చంద్రుడివై ప్రకాశిస్తావు' అని వరమిచ్చాడు. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల చంద్రుడికి పదహారు కళలు లభించాయి. సకల ప్రాణులకూ సంతోషం కలిగింది.
-పునఃకథనం: కలువకొలను సదానంద



  • ============================================

Visit my Website at - > Dr.Seshagirirao.com/

Monday, October 11, 2010

మన శాంతమే మనకు రక్ష , Our peace is our protection



మానవ జీవితం ఒక విశిస్టమైనది . పంచభూతాలతో నిర్మితమైన ఈ జీవికి పంచావసరాలు ఉంటాయి . గాలి , నీరు , ఆహారము , నిద్ర , మైధునము . వీటిలో ఏ సమయానికి అవి ఉండాలి ... లేనిచో పలు బాధలకు లోనై మనుగడే ప్రశ్నార్ధకము . ఇవి కాకుండా అరిషట్గుణాలకు లోనవుతూ ఉంటాడు మానవుడు . కామ , క్రోధ , మోహ ,లోబ , మధ , మాత్సర్యాలు వలన విలువల్ని కోల్పోతుంటాదు .
శాంతము , క్రోధము ఒకదానికొకటి వ్యతిరేకము . ఒకటి మంచి వేరొకటి చెడు .
  • తన కోపమె తన శత్రువు,
  • తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
  • తన సంతోషమె స్వర్గము,
  • తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ
పురాణ కథలు .:
కైక తండ్రి అయిన కేకయరాజు ఒక రోజు అడవికి వెళ్ళి మగలేడిని బాణము తో కొట్టి వంపగా ... ఆడాలేడి తన తల్లికి పెప్పుకుంది . అప్పుడు ఆ తల్లి లేడి మందర అనే పేరు తో మానవ స్త్రీగా పుట్టి తన అల్లుడిని చంపాడానే క్రోధం తో (పుట్టింది గనుకనే) కైకకు దాసీ గా ఉండి మాయమాటలు చెపి కేకయరాజు యొక్క అల్లుడైన దశరధుడు చనిపోయేటట్లు చేసింది . ఈ కథ వలన తెలిసిందేమిటంటే ... ఎవరికీ విరోధులం కాకూడదు , విరోధులమయ్యే పనులు చేయకూడదూ అనే నీతిని గ్రహించాలి .
అర్జునుడు యుద్ధం లో భీష్మాచార్యుడుని చంపాడు గనుక ... భీష్ముని తల్లి గంగ కు క్రోధం కలిగింది . అర్జునుడు ఆరుమాసాలలో చచ్చుగాక అని శపించినది . జ్వాలాదేవి అర్జునుడు తన కుమారున్ని చంపాడన్న క్రోధం తో అర్జునుని కుమారుడైన బభ్రువాహనుని చేతిలో బాణం గా పుట్టి అర్జునుని తలను త్రుంచేసింది . తరువాత శ్రీకృష్నుడు అర్జునుడిని బ్రతికించాడు .

అంబ భీష్మాచార్యుల పై కోపము తో శిఖండి గా పుట్టి భీష్ముని చావుకి కారణమయినది .

శ్రీ రాముడు వాలిని చంపడం వల్ల వాలి క్రోధం తో మరుజన్మలో రాముడు ... శ్రీకృష్ణుడు గా పుట్టిన తర్వాత '' వాలి కిరాతుడిగ పుట్టి శ్రీకృష్ణుడుని బాణము తో కొట్టి చంపాడు .

పై వన్నీ క్రోధం ఫలితాలే . క్రోధం తో ఇలా మరల మరల పుడుతూ పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కంటే ... క్రోధం కలిగే పనులు చేయకుండా నుంటే ఎంతో మేలు .

  • ============================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/