tag:blogger.com,1999:blog-81682814061303962532024-03-13T09:09:19.972-07:00Moral Stories for children , పిల్లల కోసం నీతి కథలుచిన్నపిల్లల కో్సము కొన్ని పురాణకథలు సేకరణ / డా.శేషగిరిరావు (శ్రీకాకుళం ).
Collection of some Epic stories for Children in Telugu /Dr.Seshagirirao(Srikakulam).seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-8168281406130396253.post-70859960344111921892015-07-29T06:27:00.004-07:002015-07-29T06:27:57.252-07:00 Godavari epic story-గోదావరి పురాణ కథ<ul>
<li> </li>
</ul>
<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-MFWdbuzhT6A/VbjUr0TwUcI/AAAAAAAABAk/I1QsOF6WaD4/s1600/Godavari.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="223" src="http://4.bp.blogspot.com/-MFWdbuzhT6A/VbjUr0TwUcI/AAAAAAAABAk/I1QsOF6WaD4/s400/Godavari.jpg" width="400" /></a></div>
<br />
<ul>
<li> </li>
</ul>
గౌతమ మహర్షి దండకారణ్యంలో తన ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాడు. దగ్గరలోనే ఒక పుష్కరిణి తవ్వించుకొన్నాడు. అందులో ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు ఉండేవి. పాడి పంటలతో ఆ ముని వాటిక సస్యశ్యామలంగా ఉండేది.<br />ఇలా ఉండగా ఆ ప్రాంతంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. భూమి బీటలు వారింది. పంటలు పండలేదు. వాగులూ వంకలూ ఎండి పోయాయి. గుక్కెడు మంచి నీళ్లు దొరకక, జనం అలమటించసాగారు. పన్నెండేళ్ల పాటు తీవ్రమైన కరువు కొనసాగింది.<br /><br />వర్షాలు కురిపించమని గౌతముడు వరుణదేవుని ప్రార్థించాడు. వరుణుడు కరుణించలేదు. గౌతముడు ఊరుకోలేదు. సూక్ష్మ శరీరంతో వరుణ లోకానికి బయలు దేరాడు. ఇది తెలిసి వరుణుడు తన నగరమైన శ్రద్ధావతి చుట్టూ మహా శక్తిమంతమైన మేఘ సమూహాలను కాపలా ఉంచాడు. గౌతముడు వాటిని చిందరవందర చేస్తూ శ్రద్ధావతిని చేరాడు.<br /><br />వరుణుడు 'నా అనుమతి లేకుండా నా నగరంలోకి ఎందుకు ప్రవేశించా'వని గద్దించాడు. కరువు పీడను గురించి చెప్పి, వానలు కురిపించమని ప్రార్థించాడు గౌతముడు. వీలు పడదని చెప్పి, వరుణ దేవుడు గౌతముని మీదికి తన పాశాయుధాలను విసిరాడు. ఆ మెరుపు తీగలతోనే గౌతముడు వరుణుడిని బంధించి తన ఆశ్రమానికి లాక్కువెళ్లాడు. అతడిని నీరుగా మార్చి పుష్కరిణిలోకి ప్రవహింపజేశాడు. 'నువ్వు అమిత పుణ్యాత్ముడివి గనుక, నీకు కట్టుబడి ఉండవలసి వచ్చింది. నిన్ను పాపం అంటిన మరుక్షణం నేనిక్కడ ఉండను' అని చెప్పి వరుణుడు అక్కడే ఉండి పోయాడు. లోకమంతా కరువు కాటకాలు తాండవిస్తున్నా గౌతముని ఆశ్రమ ప్రాంతం మాత్రం సుభిక్షంగా ఉంటున్నది.<br /><br />పన్నెండేళ్ల కరువు పూర్తయింది. లోకమంతా వానలు కురిపించాల్సిన బాధ్యత వరుణుడిపై ఉంది. పుష్కరిణిలో బంధితుడైన వరుణుడికి కర్తవ్యం తోచలేదు. అతడు బ్రహ్మను తలచుకొన్నాడు.<br /><br />ఒకనాడు పుష్కరిణి ప్రాంతంలోని వనంలోకి ఓ గోవు రాగా, గౌతముడు గడ్డి పరకతో దానిని అదిలించాడు. ఆ మాత్రానికే అది కింద పడి ప్రాణం కోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకొంది. వరుణుడికి స్వేచ్ఛ కలిగింది. పుష్కరిణి ఎండిపోయింది.<br /><br />గౌతముడు బ్రహ్మ గిరికి వెళ్లి శివుణ్ని గురించి తపస్సుచేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. శివ జటాజూటం నుంచి గంగను విడువమన్నాడు గౌతముడు. నేలమీదికి దూకిన గంగను గోవు కళేబరం వద్దకు తీసుకుపోయాడు గౌతముడు. గంగ తనను తాకగానే గోవు ప్రాణంతో లేచి నిలబడింది. గౌతమ మహర్షిని అంటిన పాపం తొలగిపోయింది. సప్తర్షులు గంగను వెంటబెట్టుకుపోయి, ఆమెను సముద్రుడికి అప్పగించారు.<br /><br />గంగా ప్రవాహం దక్షిణా పథాన్ని సస్యశ్యామలంగా మార్చింది. గౌతముడి వల్ల ఏర్పడింది కనుక గౌతమి అని గోవును బతికించింది కనుక గోదావరి అని ఆ నదికి పేర్లు వచ్చాయి.<br /><br />-పునఃకథనం: కలువకొలను సదానంద<br /> <br />
<ul>
<li>============================================ </li>
<li> Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/ </a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-89592084158775679292014-09-25T08:05:00.000-07:002014-09-25T08:05:03.168-07:00The world hungup of money-డబ్బుకు లోకం దాసోహం<ul>
<li> </li>
</ul>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-DIXiu_524kA/VCQvCFvROuI/AAAAAAAAA1I/5arxQYdLxyk/s1600/Friends%2Band%2Bsnake%2Bin%2Ba%2Bforest.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://4.bp.blogspot.com/-DIXiu_524kA/VCQvCFvROuI/AAAAAAAAA1I/5arxQYdLxyk/s1600/Friends%2Band%2Bsnake%2Bin%2Ba%2Bforest.jpg" height="320" width="293" /></a></div>
<ul>
<li>The world hungup of money-డబ్బుకు లోకం దాసోహం</li>
</ul>
<br />సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు. ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు. ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు. మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే. అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు. ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది. ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా. మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు. కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది. ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా. ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా. ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు. మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే.<br /><br />అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు. ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే. మెరుపులా తప్పుకున్నాడు రంగా. పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది. వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ. 'నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో, ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను. నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్?' అన్నాడు రాజా చిరాకు పడుతూ. 'నీ దగ్గర దాపరికమెందుకు? నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నా' అన్నాడు రంగా నిజాయితీగా. ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు. ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా. ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి. వారితో కలిసి నడవసాగాడు. రాజా, రంగాల మధ్య పాటలు, కబుర్లు, సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్. అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ, ఆలోచనలు వారి కబుర్లు, ఆనందాల్ని ఎలా అణిచేసిందో, 'డబ్బుకు లోకం దాసోహం' అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి.<br /><br />
<ul>
<li>-గుడిపూడి రాధికారాణి@ఈనాడు న్యూస్ పేపర్ </li>
</ul>
<ul>
<li>============================================ </li>
</ul>
<ul>
<li>Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/ </a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-54633401838461005062014-09-25T07:32:00.003-07:002014-09-25T07:32:45.233-07:00King .cook.Minister- రాజు.వంటవాడు.మంత్రి <ul>
<li> </li>
</ul>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-jX9VHunF6jA/VCQnKmMkh7I/AAAAAAAAA04/Ti3jTfWGOuc/s1600/King%2B%2Ccook%2B%2CMinister.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://4.bp.blogspot.com/-jX9VHunF6jA/VCQnKmMkh7I/AAAAAAAAA04/Ti3jTfWGOuc/s1600/King%2B%2Ccook%2B%2CMinister.jpg" height="320" width="239" /></a></div>
<ul>
<li><br /></li>
</ul>
<ul>
<li>wonderful dish-అపురూప వంటకం<br />విశాలనగర రాజు రాజీవుడికి తిండి ధ్యాస ఎక్కువ. అందుకే వంటల్లో ఎంతో అనుభవం ఉన్న అలకనందుడిని వంటవాడిగా నియమించాడు. ఎన్నో రకాల కొత్త కొత్త వంటలు చేస్తూ అలకనందుడు రాజీవుడికి వండి వడ్డిస్తున్నాడు. రాజు తృప్తి తీరా తిని రకరకాల రుచిల్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడప్పుడు అలకనందుడు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి వంటకాలను నేర్చుకుని వచ్చి, రాజుగారికి కొత్త రుచుల్ని పరిచయం చేస్తూ రోజుకు నాలుగు రకాల వంటలతో భోజనం సిద్ధం చేస్తున్నాడు. ఈ మధ్య అలకనందుడి వంటల్లో పస తగ్గినట్టు రాజుకు సందేహం వచ్చింది. వెంటనే వంటవాణ్ని పిలిపించాడు. 'ఇంతకాలం నాకు రుచికరమైన వంటకాలు చేసి పెట్టావు. కానీ ఈ మధ్య నీలో వంటలు చేసే ప్రావీణ్యం తగ్గింది. ఏవీ రుచిగా ఉండట్లేదు. నీకిప్పుడు ఒక పరీక్ష పెడతా. నాకు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకం చేసి పెట్టాలి. లేకపోతే నీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది' అని హెచ్చరించాడు రాజు.ఆ మాటలకి ముందుగా అలకనందుడు బయపడిపోయాడు. తర్వాత తేరుకుని 'మహారాజా! మీ ఆనతి ప్రకారం ప్రపంచంలోకెల్లా ఎంతో రుచికరమైన వంటకం వండిపెడతాను. దానికి మీరు ఒక నియమం పాటించాలి. ఆ వంటకం రుచి చూడ్డానికి రెండ్రోజుల వరకు మీరేమీ తినకుండా ఉపవాసం ఉండాలి. లేకపోతే ఈ వంటకం రుచి మీ మీద పని చేయదు' అన్నాడు అలకనందుడు.<br />ఆ షరతుకు ఒప్పుకున్నాడు రాజు. చెప్పినట్లుగానే రెండో రోజు అలకనందుడు ఘుమఘుమలాడుతున్న వంటకాన్ని తయారు చేసి రాజు ముందు పెట్టాడు. రెండ్రోజులు తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి, ఆకలితో కడుపు నకనకలాడుతున్న రాజీవుడు ఆ వంటకాన్ని ఆవురావురంటూ తినేశాడు. 'అబ్బో! అద్భుతం! అమోఘం! చాలా రుచిగా ఉంది అలకనందా! నేనింత వరకు ఇంత గొప్ప వంటకాన్ని తినలేదు' అంటూ మెచ్చుకున్నాడు రాజీవుడు. 'కృతజ్ఞతలు మహారాజా!' అని వంగి వంగి దణ్నాలు పెట్టాడు అలకనందుడు. ఇదంతా గమనిస్తున్న మహామంత్రి వంటవాణ్ని పక్కకి తీసుకెళ్లి అడిగాడు. 'అలకనందా! ఈ వంటకాన్ని ఎక్కడ నేర్చుకొని వచ్చావు? రాజుగారికి అంత బాగా నచ్చింది!' అని అడిగాడు. 'మహామంత్రీ! నన్ను మన్నించండి. ఏ వంటకం రుచి అయినా దాన్ని తినే వారి ఆకలి మీద ఆధారపడి ఉంటుంది. రాజుగారు ఈ మధ్య ఎక్కువసార్లు భోంచేస్తున్నారు. ఒకటి అరగక ముందే మరోటి తినేసరికి ఆయనకు ఏదీ రుచిగా ఉండట్లేదు. అదే ఇప్పుడు రెండు రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను ఎప్పడూ చేసిన వంటనే అమృతంలా ఉందనుకుంటున్నారు' అని అన్నాడు. అలకనందుడి తెలివికి ఎంతో మెచ్చుకున్నాడు మంత్రి.<br /></li>
</ul>
<ul>
<li>- చొక్కాపు వెంకటరమణ@ఈనాడు న్యూస్ పేపర్ </li>
</ul>
<ul>
<li>============================================ </li>
</ul>
<ul>
<li> Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/ </a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-24166423639167112582014-09-25T07:15:00.001-07:002014-09-25T07:15:17.658-07:00Milkmaid & Priest -పాలు తెచ్చే గొల్లత & పూజారి<ul>
<li> </li>
</ul>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://2.bp.blogspot.com/-oi-HcfXQa_o/VCQg6yZCukI/AAAAAAAAA0o/fnCadWxDXTc/s1600/Milkmaid%2B%26%2BPriest.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://2.bp.blogspot.com/-oi-HcfXQa_o/VCQg6yZCukI/AAAAAAAAA0o/fnCadWxDXTc/s1600/Milkmaid%2B%26%2BPriest.jpg" height="320" width="315" /></a></div>
<ul>
<li>రామనామ మహిమ</li>
</ul>
<br />రామాలయంలో ఉన్న పూజారికి ప్రతి ఉదయం ఓ గొల్లత భక్తి శ్రద్ధలతో పాలు తెచ్చి ఇస్తూ ఉండేది. ఓ రోజున ఆమె వేళతప్పి వచ్చింది. 'నేడు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటీ?' అని అడిగాడతడు. 'ఏరు దాటి రావాలికదా బాబూగారూ! పడవవాడు ఆలస్యంగా వచ్చాడు. అందుకే ఇంత జాగు' అంది ఆమె. అప్పుడా పూజారి 'ఓహో! పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటీ? రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా?' అన్నాడు పరిహాసంగా. మరునాటి నుంచీ ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్లసాగింది. 'ఫరవాలేదే! ఇప్పుడు తొందరగానే వచ్చేస్తున్నావే!' అంటూ మెచ్చుకున్నాడు పూజారి. 'మీరు చేసిన ఉపకారమే కదా బాబూ! డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయం చెప్పారు' అంది గొల్లత, కృతజ్ఞతాపూర్వకంగా.<br /><br />'ఉపాయమా? నేను చెప్పానా!' అన్నాడు పూజారి ఆశ్చర్యంగా. 'రామనామ మహిమ గురించి మీరే కదా చెప్పారు నాకు? రామారామా అనుకుంటూ ఏటిమీద నడిచి వచ్చేస్తున్నాను' అంది ఆమె. ఇలా అంటున్నదేమిటీ అనుకున్నాడతను. 'ఏదీ చూద్దాం పద!' అన్నాడు. ఇద్దరూ ఏటి వద్దకు చేరారు. 'రామరామరామరామ...' అంటూ గొల్లత ఏట్లో దిగింది. నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది. ఏటి మధ్యకు వెళ్లి తిరిగి చూసింది. పూజారి పంచెపైకెత్తి పట్టుకుని, 'రామరామరామ..' అంటూ మోకాటిలోతు నీళ్లలో తూలుతూ నడుస్తున్నాడు. 'మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేమిటండీ బాబూ? పంచె తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకుని నీళ్లలో దిగి నడుస్తున్నారేమిటీ!' అంటూ పకపకా నవ్వసాగింది గొల్లత. పూజారి సిగ్గుపడ్డాడు. వెనక్కి తిరిగి ఒడ్డెక్కాడు.<br /><br />
<ul>
<li>-పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్</li>
</ul>
<ul>
<li>============================================ </li>
</ul>
<ul>
<li>Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/</a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-20633562586782647722014-09-25T01:42:00.004-07:002014-09-25T01:42:39.912-07:00Way to Treasure-నిధికి దారి<ul>
<li> </li>
</ul>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://1.bp.blogspot.com/-Xg7bvhl1d6Y/VCPVKqxsi_I/AAAAAAAAA0Y/qBuW0lW1hQg/s1600/Way%2Bto%2BTreasure.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://1.bp.blogspot.com/-Xg7bvhl1d6Y/VCPVKqxsi_I/AAAAAAAAA0Y/qBuW0lW1hQg/s1600/Way%2Bto%2BTreasure.jpg" height="193" width="320" /></a></div>
<ul>
<li>Way to Treasure-నిధికి దారి</li>
</ul>
<br />గోకులనాధుడనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్థులను చూసి, 'అంతులేని నిధినిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం?' అన్నాడు. ఆ మాటలు విని గ్రామపెద్ద త్రిగుణయ్య 'వూరు పనికిరానిదిగా మారింది. అన్నీ బీడు భూములే. వర్షాలు పడి ఏళ్లయింది. ఇక నిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామీ?' అన్నాడు. 'నా దివ్యదృష్టికి అంతా కనిపిస్తోంది. మీలో ఒకరి కళ్లకు అంజనం రాస్తే నిధులెక్కడున్నాయో తెలుస్తుంది' అన్నాడు సన్యాసి. గ్రామస్థులంతా త్రిగుణయ్యకి అంజనం రాయమని కోరారు. సన్యాసి తన జోలె లోంచి ఓ చిన్న భరిణె తీసి అందులోని కాటుకని త్రిగుణయ్యకి రాశాడు. త్రిగుణయ్య వెంటనే 'ఆహా! అద్భుతం. నిధికి దారి స్పష్టంగా కనిపిస్తోంది. తవ్వడమే తరువాయి' అన్నాడు. ఆ మాటలకు గ్రామస్థులంతా సంబరపడి పోయి పలుగు, పార, గునపాలు, తట్టలు పుచ్చుకుని తరలి వచ్చారు. మర్నాడే పని ప్రారంభమైంది. త్రిగుణయ్య చెప్పిన చోట తవ్వుకుంటూ గ్రామస్థులు చెమటోడ్చి పని చేశారు. నిధికి దారి బీడు భూముల మీదుగా వూరికి దాపుల నున్న కొండల మధ్య నుంచి సాగింది. ఓ చోట చివ్వున జలం వూరి పనికి అడ్డం వచ్చింది. కొందరి గ్రామస్థుల చేత దాన్ని దారి మళ్లించాడు త్రిగుణయ్య. ఇలా కొన్నాళ్లయినా నిధినిక్షేపాలు కనిపించలేదు. గ్రామస్థులంతా ఓరోజు త్రిగుణయ్యను చుట్టుముట్టి, 'అసలు నిధికి సరైన దారి ఇదేనా?' అంటూ మండిపడ్డారు. త్రిగుణయ్య అయోమయంగా మొహం పెట్టి 'పదండి. సంగతేంటో ఆ సన్యాసినే అడుగుదాం' అంటూ వూరందరితో అడవిలో సన్యాసి దగ్గరకు వెళ్లి నిలదీశాడు. ఆ సన్యాసి కాసేపు కళ్లు మూసుకుని 'నేను చెప్పింది అబద్దం కాదు. పదండి చూపిస్తా' అంటూ ముందుకు నడిచాడు. గ్రామస్థులంతా అనుసరించారు. 'అదిగో చూడండి. మీ తవ్వకాల వల్ల గుక్కెడు నీళ్లు దొరకని గ్రామానికి జలసంపద లభించింది. బీడు భూములన్నీ సారవంతమయ్యాయి. రాజధాని నగరానికి కొండల మధ్య నుంచి దగ్గరి దారి ఏర్పడింది. అన్నింటినీ మించి సోమరులంతా పనిమంతులయ్యారు. ఇవన్నీ నిధినిక్షేపాలు కావా?' అన్నాడు. అంతా విన్న వూరిపెద్ద త్రిగుణయ్య 'అయ్యా! మీరు చెప్పినవన్నీ నిజమే. ఇన్నాళ్లూ బద్దకస్తులమై గ్రామాన్ని పాడుపెట్టుకున్నాం' అన్నాడు. గ్రామస్థులంతా సిగ్గుపడి తలలు దించుకున్నారు. ఆపై అందరూ పొలాలు సాగుచేసుకుని చక్కగా బతకసాగారు. గ్రామస్థుల సోమరితనాన్ని వదిలించడానికి సన్యాసి సాయంతో అంజనం నాటకమాడినట్టు త్రిగుణయ్య ఎవరికీ చెప్పలేదు.<br /><br />
<ul>
<li>-కె.కె. రఘునందన@ఈనాడు న్యూస్ పేపర్ </li>
</ul>
<ul>
<li>============================================</li>
</ul>
<ul>
<li> Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/</a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-17700615209596862014-09-25T00:56:00.000-07:002014-09-25T01:25:04.333-07:00No end for hope(Ambition)-ఆశకు అంతెక్కడ?<ul>
<li><br /></li>
</ul>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://2.bp.blogspot.com/-uAPkARm7e2w/VCPQo2RJNXI/AAAAAAAAA0M/zHVN7ggcyvY/s1600/Saint%2Band%2Bfour%2Bfriends.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://2.bp.blogspot.com/-uAPkARm7e2w/VCPQo2RJNXI/AAAAAAAAA0M/zHVN7ggcyvY/s1600/Saint%2Band%2Bfour%2Bfriends.jpg" height="200" width="193" /></a></div>
<br />
<ul>
<li> No end for hope(Ambition)-ఆశకు అంతెక్కడ?</li>
</ul>
<br />
హిమాలయాలలో నిధి నిక్షేపాలుంటాయని ఎందరో చెబితే, వాటిని సాధించి తెచ్చుకుందామని నలుగురు మిత్రులు బయలుదేరారు. అక్కడ వాళ్లకు ఒక సిద్ధుడు కనిపించాడు. అతడు వాళ్ల ప్రార్థన ఆలకించి, తలా ఓ ఉంగరం వేలికి తొడిగి, 'కొండల్లో, అడవుల్లో తిన్నగా వెళ్లండి. మీ వేలికున్న ఉంగరం ఎక్కడ జారిపడుతుందో, అక్కడ తవ్వండి. ఎవరి ప్రాప్తం ఎలా ఉందో మరి!' అన్నాడు. గునపాలు, గోనె సంచులు పట్టుకుని వాళ్లు కనుమ దారి పట్టారు. అలా రెండు రోజులు నడిచేసరికి ఒకడి ఉంగరం జారి కింద పడింది. వాడు అక్కడ తవ్వాడు. బండెడు రాగి ఇటుకలు కనిపించాయి. 'వీటిని తీసుకెళ్లి అమ్ముకుందాం. చాలా డబ్బొస్తుంది' అన్నాడు. 'మేం ఇంకా ముందుకెళ్తాం' అన్నారు మిగతా వాళ్లు. మొదటివాడు రాగి ముద్దలు తీసుకుని వెళ్లిపోయాడు. ముగ్గురు మిత్రులూ మరో రెండు రోజులు నడవగానే రెండోవాడి ఉంగరం జారిపడింది. అక్కడ తవ్వితే, వెండి దిమ్మెలు బయట పడ్డాయి. వాడు వాటిని తీసుకోగా మిగిలిన ఇద్దరూ ముందుకు సాగారు. తర్వాత మూడోవాడి ఉంగరం జారి పడింది. అక్కడ తవ్వితే బంగారం బయటపడింది. వాడు సంబరపడి, 'ఇద్దరం పంచుకుని వెళ్లిపోదాం!' అన్నాడు. 'నువ్వెళ్లు. నేనురాను! నాకు వెలకట్టలేని మణిమాణిక్యాలు దొరకవచ్చుకదా!' అంటూ నాలుగోవాడు ముందుకు సాగిపోయాడు. వాడు చాలా దూరం నడిచి, ఓ పెద్దలోయ అంచున ఆగాడు. అక్కడ వాడి ఉంగరం జారి ఆ లోయలోకి దొర్లుకుంటూ వెళ్లిపోయింది. లోయ చుట్టూ రాతిగోడల్లా నిటారుగా కొండలు! వాడు అతి కష్టం మీద లోయలోకి దిగాడు. ఎంత వెతికినా ఉంగరం కనిపించలేదు. దుబ్బులా పెరిగిన గడ్డమూ మీసాలతో ఓ పిచ్చివాడు కనిపించాడు. మణులూ మాణిక్యాలూ పొదిగిన ఓ పెద్దచక్రం కళ్లు మిరుమిట్లు గొలుపుతూ, వాడి తల మీద గిరగిరా తిరగుతోంది. ఎటు వెళితే అటు వాడితో బాటే వస్తోంది. 'భయపడకు!' అంటూ దగ్గరికి వచ్చాడు వాడు. 'నేనూ నీలాగా వచ్చిన వాణ్నే! ఇప్పుడు నేను నీకు కనిపించినట్లే, అప్పుడు ఈ చక్రాన్ని నెత్తిన మోస్తూ ఒకడు నాకు కనిపించాడు. వాణ్ని వదిలేసి ఇది నన్ను పట్టుకుంది. మణి మాణిక్యాలు లభించాయన్న సంతోషం క్షణమైనా లేకపోయింది. ఈ చక్రం నెత్తి మీది నుంచి దిగదు. ఇంటికి పోదామంటే చక్రాన్ని మోసుకుంటూ కొండలు ఎక్కలేను. ఎవరొస్తారా అని ఎదురుచూస్తూ, ఆకులలములతో ప్రాణం నిలుపుకుంటున్నాను. నా పాలిట దేవుడిలా ఇన్నాళ్లకు నువ్వొచ్చావు' అంటూ చేతులు మోడ్చాడు. వెంటనే ఆ చక్రం గిర్రున తిరుగుతూ, నాలుగో మిత్రుడి తలమీదికెక్కింది. వాడు ఆర్తనాదాలు చెయ్యసాగాడు. 'మరేం దిగులు పడకు! మన లాంటి వాడు మరొకడెవడైనా వచ్చి నిన్ను రక్షించేదాకా వేచి చూస్తూ ఉండు!' అని ధైర్యం చెప్పి, ఆ పిచ్చివాడు లోయలోంచి బయటపడ్డాడు.<br />
<br />
<ul>
<li>-పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్</li>
</ul>
<ul>
<li>============================================ </li>
</ul>
<ul>
<li>Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/ </a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-37830361718464818292014-09-24T22:50:00.000-07:002014-09-24T23:00:37.450-07:00Gift if prooved that is lie-అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి<ul>
<li> </li>
</ul>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://3.bp.blogspot.com/-yhOtdXfYM0M/VCOvbbHbpKI/AAAAAAAAAz8/qsseD8uAphY/s1600/King%2Band%2Bgift.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://3.bp.blogspot.com/-yhOtdXfYM0M/VCOvbbHbpKI/AAAAAAAAAz8/qsseD8uAphY/s1600/King%2Band%2Bgift.jpg" height="320" width="249" /></a></div>
<br />
<ul>
<li>Gift if prooved that is lie-అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి</li>
</ul>
<br />
ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికి దిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నా అందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో 'నేను చెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఇస్తాను' అన్నాడు రాజు. ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి 'సరే మహారాజా' అన్నాడు.<br />
<br />
'అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నా దాని విలువ దానిదే. కాదంటావా?' అన్నాడు రాజు నవ్వుతూ. 'అది నిజం కాదు మహారాజా! వస్తువు విలువ దాని స్థానాన్ని బట్టి మారుతుంది' అన్నాడు విదూషకుడు.<br />
'అలా అని నిరూపించగలవా?' అన్నాడు రాజు. 'మీ చేతికున్న బంగారు కడియాన్ని ఇలా ఇవ్వండి ప్రభూ' అన్నాడు విదూషకుడు. రాజు వెంటనే తీసి అందించాడు. విదూషకుడు దాన్ని ఓ భటుడికి ఇచ్చి, 'మన నగరంలో నగల వ్యాపారి మాధవయ్య దగ్గరకి వెళ్లు. అత్యవసరంగా అమ్మాలని చెప్పి ఎంతకి కొంటాడో అడిగిరా' అంటూ పంపాడు. అలా వెళ్లిన భటుడు కాసేపటికి తిరిగి వచ్చి, 'ఇరవై వరహాలు ఇస్తానన్నాడు ప్రభూ' అన్నాడు. విదూషకుడు ఈసారి ధనాగారం పర్యవేక్షణ అధికారిని పిలిచి కడియం ఇచ్చి 'మాధవయ్య దీన్ని ఎంతకు కొంటాడో కనుక్కో' అని పంపాడు. కాసేపటికి తిరిగి వచ్చిన ఆ అధికారి, 'నలభై వరహాలు ఇస్తానన్నాడు' అన్నాడు. తర్వాత విదూషకుడు దారినపోయే బీదవాణ్ణి పిలిచి ఇంతకు ముందులాగే మాధవుడి దగ్గరకు పంపాడు. అతడి వెంట ఓ సైనికుడిని రహస్యంగా వెంబడించమన్నాడు. వర్తకుడి దగ్గరకు వెళ్లిన బీదవాడు కడియాన్ని ఇచ్చి, 'అయ్యా! దీని ధర ఎంత?' అని అడిగాడు. వర్తకుడు వాడిని ఎగాదిగా చూసి పది వరహాలు వాడి చేతిలో పెట్టి, 'దీన్ని నువ్వు ఎక్కడో దొంగిలించి ఉంటావు. మర్యాదగా ఇది తీసుకుపో. లేదా ఫిర్యాదు చేస్తాను' అంటూ దబాయించాడు. ఆపై సైనికుడి ద్వారా జరిగిందంతా తెలుసుకున్న విదూషకుడు, రాజు కేసి తిరిగి 'చూశారా మహారాజా! ఒకే నగ. ఒకే వర్తకుడు. భటుడికి ఒక విలువ, అధికారికి ఒక వెల, బీదవాడికి ఒక ధర చెప్పాడు. వస్తువు విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి మారుతుందని తేలిందిగా?' అన్నాడు. రాజు నవ్వేసి విదూషకుడికి బహుమతి ఇచ్చాడు.<br />
<br />
<ul>
<li>-పుప్పాల కృష్ణమూర్తి@ఈనాడు న్యూస్ పేపర్ </li>
</ul>
<ul>
<li>==============================</li>
</ul>
<ul>
<li> Visit my Website at - > <span id="goog_672429956"></span><a href="https://www.blogger.com/">Dr.Seshagirirao.com/ </a><span id="goog_672429957"></span></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-64737453936457230552014-09-24T08:46:00.002-07:002014-09-24T08:46:15.421-07:00Bet with higher cadre not good-అధికులతో పోటీకి దిగటం అనర్థం<ul>
<li> </li>
</ul>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-8SYD7uPvlLA/VCLm52w8zpI/AAAAAAAAAzs/gpNDT8R7QQk/s1600/Crow%2B%26%2BSwan.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://4.bp.blogspot.com/-8SYD7uPvlLA/VCLm52w8zpI/AAAAAAAAAzs/gpNDT8R7QQk/s1600/Crow%2B%26%2BSwan.jpg" height="320" width="303" /></a></div>
<ul>
<li>Bet with higher cadre not good-అధికులతో పోటీకి దిగటం అనర్థం</li>
</ul>
<br />ఓ పెద్ద సరస్సు. రకరకాల నీటి పక్షులతో కళకళలాడుతూ ఉండేది. అందమైన రాయంచలెన్నో అక్కడ విహరిస్తుండేవి.<br /><br />ఆ పరిసరాలలో ఉన్న కాకికి హంసలపట్ల అసూయకలిగింది. తెల్లటి ఈకలతో, అవి సుందరంగా ఉన్నాయి. వాటి స్వరాలు వీనుల విందుగా రాగాలు పలుకుతుంటాయి. తానేమో అందంగా లేదు. తన కూత కర్కశంగా ఉంటుంది. హంసల్ని మెచ్చుకునే వాళ్లెవరూ తనవైపు చూడనైనా చూడరు. అందుకే వాటికి అంత గర్వం! వాటి పొగరణచాలన్న గట్టి కోరిక కాకికి కలిగింది.<br /><br />అది సరస్సు నడుమ వొయ్యారంగా ఈదులాడుతున్న హంసలరాజు తల చుట్టూ ఎగురుతూ, 'ఏమోయ్! నువ్వేనా హంసల రాజువి? నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావ్? ఎందులో నీ గొప్ప? మా కాకులకంటే మిన్నగా నువ్వెగరగలవా? నాతో పందెం కాయి చూద్దాం!' అంది డాంబికంగా.<br /><br />'నీతో నాకెందుకు పోటీ?' అంది రాజహంస సౌమ్యంగా. 'భయపడుతున్నావా?' అంటూ హేళనగా నవ్వింది కాకి. ఒంటి రెక్కతో కాసేపు, వంకరటింకరగా కాసేపు, పల్టీలు కొడుతూ కాసేపు ఎగిరి చూపించింది. 'చూశావా నా విన్యాసాలు? నువ్వు నన్ను గెలవలేవు' అంది అట్టహాసంగా.<br /><br />'ఆకాశంలో నాకంటే ఎక్కువ సేపు ఉండగలనన్న నమ్మకం నీకుంటే, పోటీకి సిద్ధమే!' అంది హంస.<br /><br />ఆ రెండూ ఒక్కసారిగా ఆకాశంలోకి లేచాయి. కాకి వేగంగా ముందుకెళ్లిపోయింది. వెనక వస్తున్న హంసను అపహాస్యం చేసింది.<br /><br />హంస మెల్లగా ఎత్తులకెగురుతూ, 'ఏదీ, నాలాగా మేఘాలను దాటుకో చూద్దాం' అంది. హంస కంటే తక్కువ కాకూడదని కాకి కూడా పైపైకి పోసాగింది. అప్పటికి అది అలిసి పోయింది. కళ్లు బైర్లు కమ్మాయి. అది గమనించిన హంస 'ఇక నీ వేగం ఏ పాటిదో చూపించు' అంటూ ముందుకు దూసుకుపోసాగింది. ఆ వేగాన్ని అందుకోవడం కాకికి సాధ్యం కాలేదు. చాలా దూరం వెళ్లాక, దానికి రెక్కలాడించడమే కష్టమైపోయింది. గుండె పగిలి పోయేలా రొప్పుతూ, కింద ప్రవహిస్తున్న ఓ నదిలో దబుక్కున పడిపోయింది. 'హంస రాజా! నన్ను కాపాడు. నేను ఓడిపోయాను. నా ధిక్కారాన్ని మన్నించు' అని వేడుకుంది కాకి.<br /><br />హంస కిందికి వచ్చి, మునిగిపోతున్న కాకిని పైకి లాగి వీపున వేసుకుని దాని గూటికి చేర్చింది. 'అధికులతో పోటీకి దిగటం అనర్థమని తెలిసొచ్చింది..' అంటూ లెంపలు వేసుకొంది కాకి.<br />
<ul>
<li>-పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్</li>
</ul>
<ul>
<li>============================================ </li>
</ul>
<ul>
<li>Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/</a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-46912942635502709082014-09-24T08:28:00.001-07:002014-09-24T08:29:53.591-07:00 Hundredth Strike-వందో దెబ్బ<ul>
<li> </li>
</ul>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-6muHHV2iwsU/VCLi7wMkOUI/AAAAAAAAAzg/mH1PiapKp0Q/s1600/Zamindar%2Band%2Bworker.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://4.bp.blogspot.com/-6muHHV2iwsU/VCLi7wMkOUI/AAAAAAAAAzg/mH1PiapKp0Q/s1600/Zamindar%2Band%2Bworker.jpg" height="320" width="244" /></a></div>
<br />
<ul>
<li> Hundredth Srike-వందో దెబ్బ</li>
</ul>
<br />
దేవీపురం జమీందారు దగ్గర మల్లయ్య నగదు వ్యవహారాలు చూసేవాడు. ఓసారి జమీందారు అతనికి వంద వజ్రాలు ఇచ్చి జాగ్రత్త చేయమన్నాడు. ఓరోజు రాత్రి దివాణంలో దొంగ ప్రవేశించి వజ్రాలు దొంగిలించాడు. మర్నాడు మల్లయ్య వచ్చి చూసేసరికి ఒకటే వజ్రం కనిపించింది. దొంగ హడావుడిలో దాన్ని వదిలేశాడని అర్థమైన మల్లన్నకి దురాశ పుట్టింది. వెంటనే దాన్ని తన తలపాగాలో దాచేసి, ఏమీ ఎరగనట్టు జమీందారు దగ్గరకు వెళ్లి చోరీ సంగతి చెప్పాడు. జమీందారు వెంటనే రక్షక భటులను నలుమూలలా పంపించాడు. కాసేపటికే ఆ దొంగ దొరికి పోయాడు. భటులు వాడిని జమీందారు దగ్గరకు తీసుకు వచ్చి సోదా చేస్తే వజ్రాల సంచీ కనిపించింది. అయితే అందులో 99 మాత్రమే ఉన్నాయి. <br />
<br />
'ఏదీ మరో వజ్రం? బయటకి తియ్' అంటూ జమీందారు గద్దించాడు. ఆ దొంగ వణికి పోతూ 'నేను సంచీ విప్పి చూస్తే వజ్రాలు కనిపించాయి. వాటిని సంచీలో వేసుకుని పారిపోయానేగానీ, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు' అన్నాడు.<br />
<br />
ఆ సమాధానం విన్న మల్లన్నకి వణుకు పుట్టింది. వెంటనే దొంగ దగ్గరకి వెళ్లి వాడి చెంప మీద కొట్టి 'నిజం చెప్పకపోతే వూరుకునేది లేదు' అంటూ దబాయించాడు. ఆ వూపులో అనుకోకుండా మల్లన్న తలపాగా కిందపడి వందో వజ్రం బయటకి దొర్లింది. జమీందారు సంగతంతా గ్రహించి, 'ఇద్దరూ దొంగలే. చెరో వంద కొరడా దెబ్బలు కొట్టి తరిమేయండి' అన్నాడు కోపంగా.<br />
<br />
అది విన్న మల్లన్న మొండిగా, 'ఇది అన్యాయం. 99 వజ్రాల దొంగకి, ఒకటి తీసుకున్న నాకూ శిక్ష ఒకటేనా?' అని ఎదిరించాడు.<br />
<br />
జమీందారు ఒక్క క్షణం ఆలోచించి 'సరే. నువ్వన్నట్టే శిక్ష మారుస్తాను' అంటూ దొంగవైపు తిరిగి, 'నువ్వు ఎన్ని దొంగిలించావు?' అని అడిగాడు.<br />
<br />
'తొంభై తొమ్మిది' అన్నాడు దొంగ.<br />
<br />
'అయితే నీకు 99 కొరడా దెబ్బలు' అన్న జమీందారు, ఆపై మల్లన్న వైపు తిరిగి, 'నువ్వు ఎన్నో వజ్రం దొంగిలించావు?' అని అడిగాడు.<br />
<br />
'వందోది' అన్నాడు మల్లన్న. 'అయితే వందో దెబ్బ నీకు' అన్నాడు జమీందారు. అమ్మయ్య అనుకున్నాడు మల్లన్న.<br />
<br />
భటులు ముందుగా దొంగకి తొంభై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు. మల్లన్న వెంటనే 'ఆ వందోది నాకు వేసేయండి' అన్నాడు. జమీందారు నవ్వి, 'వందో దెబ్బ తినాలంటే మొదట తొంభైతొమ్మిదీ భరించాలి కదా? కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మకద్రోహం చేసిన నువ్వు ఆ దొంగ కన్నా ప్రమాదకారివి' అన్నాడు. మల్లన్న తెల్లబోయి మొత్తం వంద కొరడా దెబ్బలూ తిన్నాడు.<br />
<ul>
<li>-వేముల రామ మోహన రావు@ఈనాడు న్యూస్ పేపర్</li>
</ul>
<ul>
<li>============================================</li>
</ul>
<ul>
<li> Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/ </a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-44894260150661732722014-09-23T19:25:00.000-07:002014-09-24T08:08:59.184-07:00Exact medicine-తగిన మందు<ul>
<li> </li>
</ul>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-9JIpbIvjRsw/VCIqYObUTWI/AAAAAAAAAzQ/T9COFwfm0iQ/s1600/wolf-Lion-fox.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://4.bp.blogspot.com/-9JIpbIvjRsw/VCIqYObUTWI/AAAAAAAAAzQ/T9COFwfm0iQ/s1600/wolf-Lion-fox.jpg" height="178" width="200" /></a></div>
<br />
<ul>
<li>Exact medicine-తగిన మందు</li>
</ul>
<br />
అడవికి రాజైన సింహానికి జబ్బుచేసింది. జంతువులన్నీ వచ్చి పరామర్శించి వెళ్లాయి. ఒక్క నక్క మాత్రం రాలేదు. రాజు మెప్పు పొందాలని తోడేలు సపర్యలు చేస్తూ రోజంతా అక్కడే ఉండిపోయింది. నక్కంటే దానికి సుతరామూ పడదు. 'చూశారా ప్రభూ! అందరూ వచ్చారు. మీ యోగక్షేమాలు విచారించి వెళ్లారు. నక్కమాత్రం రానేలేదు. మీరంటే దానికి ఎంత చులకనో!' అంటూ ద్వేషం రగిల్చింది. 'ఎంత కావరం! దాని సంగతి చూస్తాన్లే!' అంటూ కోపంతో గుర్రుమంది సింహం. గుహ బయట నక్కిఉన్న పిల్లి ఈ సంభాషణ విన్నది. వెళ్లి నక్కకు సంగతి చేరవేసింది. 'తోడేలు బాగా నూరిపోసింది. సింహం నీ మీద చాలా కోపంగా ఉంది.' నక్క వెంటనే బయలుదేరి, తోడేలును కలుసుకొంది. 'తోడేలన్నా! రాజుగారికి జబ్బుచేసిందట. వారిని చూడటానికి నేను వెళ్లలేకపోయాను. ఇప్పుడు వెళ్లి విచారించి వద్దాం, నాతో వస్తావా?' అని అడిగింది. తోడేలు సంతోషంగా ఒప్పుకొంది. అవి రెండూ సింహం గుహను సమీపించాయి. నక్కను చూడగానే సింహం ఆగ్రహంతో గర్జించింది. తమాషా చూడాలని తహతహలాడున్నది తోడేలు. 'దొరవారికి పాదాభివందనాలు!' అంటూ మోకరిల్లింది. నక్క. 'తమరికి జబ్బు చేసిందని వినగానే, తగిన మందు పట్టుకొద్దామని వెళ్లాను. ఎక్కడా దొరకలేదు. ఆయుర్వేద వైద్యశిరోమణులు ఏనుగు, బెబ్బులీ, ఒంటె మొదలైన వారిని కలిశాను. అందరూ ఒకే మందు చెప్పారు...' సింహం ముఖం విప్పారింది. 'ఏమిటా మందు?' అడిగింది. 'తమరు వేడివేడిగా తోడేలు నెత్తురు తాగాలని వాళ్లన్నారు. తమవ్యాధి త్వరితంగా నయం కావాలంటే, అదొక్కటే మందంటున్నారు...' అంటూ నక్క తోడేలు వంక ఓరకంట చూసింది. 'ఇంకా చెప్పేదేముంది ప్రభూ! ఇక్కడ తోడేలు సిద్ధంగానే ఉంది కదా!' అంటూ ముక్తాయించింది. తనకు చావు మూడిందని తోడేలు గజగజావణికిపోయింది. 'అయితే, ఇక ఆలస్యం చెయ్యను' అంటూ సింహం కుప్పించి ముందుకు దూకింది. అంతకంటే ముందే తోడేలు గుహ బయటికి పరుగు తీసింది.<br />
<br />
<ul>
</ul>
<ul>
<li>పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్ </li>
</ul>
<ul>
<li>=======================================</li>
</ul>
<ul>
<li> Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/ </a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-87629492255539066982014-09-23T18:56:00.001-07:002014-09-23T18:58:42.716-07:00Teacher and Student,గురువు గురువే<ul>
<li> </li>
</ul>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://3.bp.blogspot.com/-mpHD3MpMwyg/VCIkiDQ_goI/AAAAAAAAAzE/hya5EEaQX3o/s1600/Teacher%2Band%2BStudent.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://3.bp.blogspot.com/-mpHD3MpMwyg/VCIkiDQ_goI/AAAAAAAAAzE/hya5EEaQX3o/s1600/Teacher%2Band%2BStudent.jpg" height="320" width="250" /></a></div>
<br />
<ul>
<li> గురువు గురువే</li>
</ul>
సచ్చిదానంద స్వామి ప్రబోధాలు చేస్తూ వూరూరా తిరుగుతుండేవాడు. ప్రజలిచ్చే దక్షిణను ఖర్చుల కోసం స్వీకరించేవాడు. కొంత కాలానికి ఆయన దగ్గర ఒక మూట నిండా కాసులు సమకూరాయి. దాన్ని ఆయనెప్పుడూ తన రొండిన దోపుకునే ఉండేవాడు.<br />
<br />
అది గమనించిన ఒక ఆకతాయి దాన్నెలాగైనా దొంగిలించాలనుకున్నాడు. ఓసారి వినయంగా స్వామి వారిని కలిసి, 'నేనొక అనాధను. నన్ను శిష్యునిగా స్వీకరించారంటే సేవలు చూస్తూ కూడా తిరుగుతాను' అంటూ అభ్యర్థించాడు. స్వామీజీ వాడి మాటలు నమ్మి వాడి భుజాన ఒక జోలెను తగిలించి శిష్యుడిగా చేర్చుకున్నారు. ప్రతి రోజూ గురుశిష్యులు వూరూరా తిరుగుతూ రాత్రి వేళ ధర్మసత్రాల్లో బస చేసేవారు. ఎవరి జోలెను వారు పక్కన పెట్టుకుని పడుకునేవారు. నాలుగు రోజులు గడిచాక స్వామిజీ గాఢ నిద్రలో ఉండగా ఆయన రొండిన కాసుల మూట కోసం శిష్యుడు వెదికాడు. అది కనిపించలేదు. నెమ్మదిగా ఆయన జోలె తీసి చూశాడు. అందులోనూ లేదు. 'గురువు గట్టోడే. కాసుల మూటను ఎక్కడో దాచాడు' అనుకున్నాడు శిష్యుడు. మర్నాడు స్నానం చేసి వచ్చిన గురువుగారి రొండిన కాసుల మూట యధావిధిగా కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి కూడా వాడు వెతికి చూశాడు కానీ ఎక్కడా మూట కనిపించలేదు. మరో నాలుగు రోజులు తిరిగేసరికి ఆకతాయి శిష్యుడికి విసుగెత్తింది. గురువుగారి దగ్గరకు వెళ్లి, 'స్వామీ. ఈ సంచార జీవితం మొహం మొత్తింది. ఏదైనా వృత్తి చేసుకుని కాలం గడుపుతాను. సెలవిప్పించండి' అన్నాడు. 'తప్పకుండా పోయిరా నాయనా! ఎక్కడున్నా మంచి బుద్ధితో మెలుగు' అన్నారు సచ్చిదానంద స్వామి. వెళ్లిన శిష్యుడు వెంటనే తిరిగొచ్చి, 'గురువుగారూ! నాదొక చిన్న సందేహం. పగలంతా మీ మొలను వేలాడే కాసుల మూట రాత్రి వేళ కనిపించదేం? ఎక్కడ దాచేవారో వినాలని కుతూహలంగా ఉంది' అన్నాడు. సచ్చిదానంద స్వామి నవ్వి, 'నాయనా! నీ వాలకాన్ని మొదటి రోజే గ్రహించాను. రోజూ రాత్రి నీ వెదుకులాట గమనిస్తూనే ఉన్నాను. అందుకనే నిద్రపోయే ముందు కాసుల మూటను నీ జోలెలోనే పెడుతూ వచ్చాను. మర్నాడు నీకన్నా ముందే లేచి తీసుకునేవాణ్ణి. ఇతరులది దోచుకోవాలనుకునే వాడు తన దగ్గరున్నదాన్ని గ్రహించలేడు కదా శిష్యా!' అన్నారు. శిష్యుడు సిగ్గుతో తలవంచుకుని వెళ్లిపోయాడు.<br />
<br />
<ul>
<li>-శ్రీపాద సత్యనారాయణ@ఈనాడు న్యూస్ పేపర్ </li>
</ul>
<br />
<ul>
<li>==============================</li>
</ul>
<ul>
<li> Visit my Website at - ><a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank"> Dr.Seshagirirao.com/ </a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-63259924605477601252014-02-18T00:34:00.000-08:002014-02-18T00:39:22.090-08:00 గుర్రం గుడ్డు 'ఢాం'... మేకపిల్ల 'మే'!<ul>
<li><br /></li>
</ul>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://3.bp.blogspot.com/-vj15i-f-wnE/UwMcIA7OWtI/AAAAAAAAAlY/9X_GMitOFe0/s1600/Gurram+Guddu+Dhaam++MEkapilla+mayE.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://3.bp.blogspot.com/-vj15i-f-wnE/UwMcIA7OWtI/AAAAAAAAAlY/9X_GMitOFe0/s1600/Gurram+Guddu+Dhaam++MEkapilla+mayE.jpg" height="320" width="279" /></a></div>
<span id="goog_101793527"></span><span id="goog_101793528"></span><br />
<br />
రామాపురంలో ఉండే గోపాల్ చాలా అమాయకుడు. వాడికి నా అనేవాళ్లెవరూ లేరు. గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్కి అన్నం పెట్టేవారు. అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు. కానీ గోపాల్ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.<br />
<br />
వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు. ఆయనకో చిన్న కొడుకున్నాడు. ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు. అంతలో అటుగా వెళుతున్న గోపాల్ను పిలిచారు మాష్టారు. వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు. సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్. <br />
<br />
దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు. ఆయన దగ్గరికెళ్లి 'ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?' అడిగాడు గోపాల్. 'ఏమో నాకు తెలీదు' అని చెప్పాడు అతను. తర్వాత గోపాల్ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ 'ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్?' అడిగాడు. 'వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే. ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే' అని మనుసులో అనుకుని 'ఇవి గుర్రం గుడ్లు బాబూ! కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి' అని చెప్పాడు.<br />
<br />
దానికి గోపాల్ చాలా సంతోషించాడు. మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు' అని మనసులో అనుకుని 'దీని ధరెంత?' అడిగాడు గోపాల్. 'ఒక్క గుడ్డు యాభై రూపాయలు' చెప్పాడతను. <br />
<br />
గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్.<br />
<br />
దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్. ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.<br />
<br />
అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది. 'అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే' అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు. అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు. ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు. <br />
<br />
- కోట శ్రీదేవి@eenadu hai bujjiగుర్రం గుడ్డు 'ఢాం'... మేకపిల్ల 'మే'!<br />
రామాపురంలో ఉండే గోపాల్ చాలా అమాయకుడు. వాడికి నా అనేవాళ్లెవరూ లేరు. గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్కి అన్నం పెట్టేవారు. అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు. కానీ గోపాల్ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.<br />
<br />
వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు. ఆయనకో చిన్న కొడుకున్నాడు. ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు. అంతలో అటుగా వెళుతున్న గోపాల్ను పిలిచారు మాష్టారు. వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు. సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్. <br />
<br />
దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు. ఆయన దగ్గరికెళ్లి 'ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?' అడిగాడు గోపాల్. 'ఏమో నాకు తెలీదు' అని చెప్పాడు అతను. తర్వాత గోపాల్ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ 'ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్?' అడిగాడు. 'వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే. ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే' అని మనుసులో అనుకుని 'ఇవి గుర్రం గుడ్లు బాబూ! కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి' అని చెప్పాడు.<br />
<br />
దానికి గోపాల్ చాలా సంతోషించాడు. మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు' అని మనసులో అనుకుని 'దీని ధరెంత?' అడిగాడు గోపాల్. 'ఒక్క గుడ్డు యాభై రూపాయలు' చెప్పాడతను. <br />
<br />
గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్.<br />
<br />
దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్. ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.<br />
<br />
అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది. 'అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే' అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు. అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు. ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు. <br />
<br />
- కోట శ్రీదేవి@eenadu hai bujji<br />
<br />
============================================<br />
Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/</a>seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-70247616807943611072014-02-18T00:18:00.000-08:002014-09-23T19:28:35.413-07:00Oldman School,తాత బడి<ul>
<li> </li>
</ul>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-Cw5ZzTLp5y8/UwMXFpK-VDI/AAAAAAAAAlI/D4wSl8donR8/s1600/Grand-father+School.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://4.bp.blogspot.com/-Cw5ZzTLp5y8/UwMXFpK-VDI/AAAAAAAAAlI/D4wSl8donR8/s1600/Grand-father+School.jpg" height="300" width="320" /></a></div>
<ul>
<li> </li>
</ul>
ఆరేళ్ల నానికి తాతయ్యను చూడాలని కోరిక. అమ్మని, నాన్నని అడిగితే తాతయ్య పుట్టిన రోజు నాడు వెళదామని నచ్చజెప్పారు. తాతయ్య పుట్టిన రోజు రానే వచ్చింది. ఉదయం నుంచి నాని హడావుడి ఎక్కువయింది. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు. అమ్మ, నాన్న, నాని కారులో బయలుదేరారు.<br />
<br />
'తాతయ్యకి డెబ్బయ్యేళ్లు. ఆయన ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నారు. ఒంటరిగా ఆశ్రమంలో ఉంటున్నారు. నీకు మంచి మంచి కథలు చెపుతారు' నానికి చెప్పాడు నాన్న.<br />
ఆశ్రమానికి చేరారు. నానిని చూడగానే తాతయ్య నవ్వుతూ 'బంగారుకొండా! రారా!' అంటూ దగ్గరికి తీసుకుని ముఖాన్ని ముద్దులతో నింపేశాడు. నానికి ఒళ్లు పులకించింది. తాతయ్యను ముద్దు పెట్టుకున్నాడు.<br />
<br />
నానిని తన గదిలోకి తీసుకుపోయాడు తాతయ్య. బోలెడు బొమ్మలు, బొమ్మల పుస్తకాలు చూపించాడు. పళ్లెంలో ఉన్న రకరకాల పండ్లు చూపించి 'నీకు కావల్సినవి తీసుకో' అన్నాడు.<br />
తరువాత నానిని భుజాల మీద కూర్చోబెట్టుకుని తోటలోకి తీసుకుపోయి చెట్లు, పిట్టలు చూపించాడు. చెట్ల కథలు, పిట్టల కథలు చెప్పాడు. ఆకాశంలోని మబ్బులు చూపించాడు. మబ్బుల ఆకారాలను చూపించి పాటలు పాడాడు. నానితో పాడించాడు. గాజు తొట్టెలోని రంగురంగుల చేపలను చూపిస్తుంటే, అవి నీటిలో ఈదుతూ ఉంటే చూసి మురిసిపోయాడు నాని.<br />
<br />
వాళ్లలా కాసేపు తోటలో దాగుడుమూతలు ఆడారు. దొంగా పోలీసు ఆట ఆడారు. పరుగు పందెంలో నాలుగుసార్లు నాని గెలిచాడు. విజయగర్వంతో గంతులేశాడు నాని.<br />
మధ్యాహ్నం తాతయ్య పుట్టినరోజు కేకుకోసి, నానికి తినిపించాడు. తాతయ్య ఒక బొమ్మల పుస్తకం నానికి బహుమతిగా ఇచ్చాడు. దానిని అపురూపంగా చూసుకున్నాడు నాని. జేబులోంచి కొత్త పదిరూపాయిల నోటు తీసి ఇచ్చి 'ఇది నా గుర్తుగా ఉంచుకో' అన్నాడు తాతయ్య. నాని ఆనందానికి అంతులేదు.<br />
<br />
భోజనాలు చేశాక అమ్మ, నాన్నతో కలిసి నాని బయలుదేరాడు. 'తాతయ్యా! నువ్వు నాకు నచ్చావు' అన్నాడు నాని. 'మనవడా! ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు' 'నా పేరు నాని, తాతయ్య, నీ పేరు?' అన్నాడు నాని.'నా పేరు తాతయ్యే' అంటూ ముసిముసిగా నవ్వాడు. 'తాతయ్యా! నీ పుట్టిన రోజు బాగా జరిగింది కదా!' 'అవును నానీ! రేపు నీలాంటి మరొక మనవడు వస్తాడు. ఇలా ప్రతిరోజూ నాకు పుట్టినరోజే!' అన్నాడు తాతయ్య. తను నడుపుతున్న 'తాతబడి' అనే వృద్ధాశ్రమం నుంచి వెళ్లిపోతున్న నానిని చూస్తూ, చెమర్చిన కళ్లు తుడుచుకున్నాడు తాతయ్య.<br />
<br />
<ul>
<li>- చొక్కాపు వెంకటరమణ@eenadu hai bujji</li>
</ul>
<ul>
<li>============================================ </li>
</ul>
<ul>
<li> Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/</a></li>
</ul>
seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-40478308354454009452013-11-03T15:48:00.001-08:002014-09-23T07:57:45.514-07:00Bali king,Mahabali , మహాబలిల్,బలి చక్రవర్తి<ul>
<li><br /></li>
</ul>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-VjQBauKeQeM/UnbkkgyddoI/AAAAAAAAAX0/a5ryWiMRSMk/s1600/Bali+king+and+Vomana.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://4.bp.blogspot.com/-VjQBauKeQeM/UnbkkgyddoI/AAAAAAAAAX0/a5ryWiMRSMk/s320/Bali+king+and+Vomana.jpg" height="163" width="320" /></a></div>
<br />
<ul>
<li><br /></li>
</ul>
భారతదేశవ్యాప్తంగా పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది. మెదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి.<br />
<br />
మహా బలికి స్వాగతం 'ఓనం'<br />
చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా మరియు సిరిసంపదలతో ఉన్నారు మరియు ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. తన సుగుణములన్నింటితోపాటు, మహాబలికి ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు.<br />
బలి చక్రవర్తి ఏడాదికోమారు భూలోకానికి వచ్చి, తన ప్రజలందరి యోగక్షేమాలు తెలుసుకుంటాడని జన విశ్వాసం. కేరళలో బలి ఆగమనానికి గుర్తుగా 'ఓనం' పండుగ జరుపుకుంటారు. మలయాళీయుల పంచాంగం ప్రకారం తొలిమాసమైన 'చింగం (ఆగస్టు-సెప్టెంబర్ల నడుమ)'లో ఓనం వస్తుంది. ఈ పండుగ పదిరోజులపాటు కొనసాగుతుంది. చిక్కని పువ్వుల రంగవల్లులు, పసందైన విందు భోజనం, కొత్త బట్టలు, ఆటపాటల కోలాహలంతో ఈ పదిరోజులు కేరళ అంతా సందడిగా ఉంటుంది. దేశ విదేశాల్లో ఉన్న మలయాళీయులుసైతం తమ తమ ప్రాంతాల్లోనే ఈ పండుగ జరుపుకుంటారు. <br />
<br />
అహంకారాన్ని అణచిన త్రివిక్రముడు<br />
పురాణకథనాల ప్రకారం, బలి చక్రవర్తి రాక్షసుడైనప్పటికీ జనరంజకంగా పాలించేవాడు. మహాదాత. ఆయన పాలనలో జనులు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించేవారు. అయితే బలికి అహంకారం పెరగసాగింది. స్వర్గాధిపత్యం సాధించి ఇంద్ర పదవి పొందాలన్న ఆశతో మహా క్రతువు తలపెట్టాడు. అర్హతలేకుండా అందలం ఆశించడంతో శ్రీమహావిష్ణువు వామనావతారం దాల్చి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. క్రతువు జరుగుతుండగా యాగశాలకు వటువు రూపంలో విష్ణుమూర్తి వచ్చి, మూడడుగులు దానమడుగుతాడు. కులగురువైన శుక్రాచార్యుడు అడ్డుకున్నప్పటికీ బలి చక్రవర్తి దానం ఇవ్వడానికే సిద్ధపడతాడు. <br />
దానం అందుకోగానే వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా భూమ్యాకాశాలను రెండు అడుగులతో ఆక్రమిస్తాడు. మూడో అడుగు ఎక్కడ మోపాలని అడగ్గా, తన శిరస్సు చూపుతాడు బలి. విష్ణువు ఆ విధంగా బలిని పాతాళానికి పంపుతాడు. అయితే బలి చక్రవర్తి పాలనాపరంగా పుణ్యాత్ముడు కావడంతో అతనినే పాతాళ చక్రవర్తిగా నియమిస్తాడు. ఏడాదికోమారు భూమిపైకి వచ్చి తన ప్రజలను పలకరించే వరాన్నికూడా ప్రసాదించాడు విష్ణుమూర్తి. అలాగే బలి ఆశించినట్టుగానే అతనికి ఇంద్ర పదవి దక్కే అవకాశాన్ని ఎనిమిదో మన్వంతరంలో కల్పించాడు.<br />
<br />
పసందైన ఓనసద్య <br />
మహాబలి భూమికి వచ్చే పర్వదినాలే ఓనం. ఓనంకు పది రోజుల ముందునుంచే కేరళలోని ప్రతి ముంగిలి రంగవల్లులతో కళకళలాడడం అనవాయితీ. బలి చక్రవర్తిని ఆహ్వానించడంలో భాగంగా 'ఓనపూక్కలం' పేరుతో పువ్వులతో రంగోలి అమరుస్తారు. బలి ప్రతి ఇంటికీ వచ్చి యోగక్షేమాలు కనుక్కుంటాడని ప్రజల నమ్మకం. తిరుఓనం నాడు 11 నుంచి 13 రకాల ఆహార పదార్థాలతో అరటి ఆకులలో 'ఓనసద్య విందు' చేస్తారు. <br />
<br />
త్రివిక్రముడికి ప్రత్యేక పూజలు<br />
ఓనం రోజులలో కేరళలోని త్రిక్కకరలోగల వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ తమ ఇళ్లలో త్రిక్కకర అప్పన్ (వామనుడు) విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. ఓనం పండుగ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళ పడవ పందాలు నిర్వహిస్తారు. సర్పాకారంతో తయారుచేసిన పడవలపై 100మంది వరకూ నావికులు కూర్చుని పంపానదిలో పోటీకి దిగుతారు. <br />
<br />
పురాణం<br />
<br />
మహాబలి ప్రహ్లాదుని మనుమడు.విరోచనుడు ని కొడుకు. ప్రహ్లాదుడు అసురుడైనప్పటికీ, విష్ణువు పైన గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. మహాబలి చిన్నపిల్లవాడుగా ప్రహ్లాదుని ఒడిలో ఉండగానే విష్ణువుపైన ప్రేమను మరియు భక్తిని అలవరుచుకున్నాడు.<br />
<br />
మహాబలి ముల్లోకములను జయించుట<br />
<br />
కశ్యపుడుకి ఇద్దరు భార్యలు, దితి మరియు అదితి, వీరు రాక్షసులు మరియు దేవతల (అసురులు మరియు దేవతలు) తల్లితండ్రులు. తపస్సు చేసుకోవటానికి హిమాలయములకు వెళ్ళిన కశ్యపుడు, తిరిగి వచ్చి అదితి శోకిస్తూ ఉండటాన్ని కనుగొంటాడు. దివ్య దృష్టితో కశ్యపుడు వెంటనే ఆమె బాధకు కారణమును కనుగొంటాడు. ఈ ప్రపంచములో దేవుని ఇష్టం లేకుండా ఏదీ జరగదనీ మరియు ప్రజలు వారి విధులు నిర్వర్తిస్తూ ఉండాలని చెపుతూ ఆయన, ఆమెను సమాధాన పరచటానికి ప్రయత్నించాడు. ఆయన, ఆమెకు విష్ణునును పూజించమని చెపుతూ పయోవ్రతమును బోధించాడు, ఇది కార్తీక మాసము యొక్క శుక్ల పక్షములో పన్నెండవ రోజు (శుక్ల-పక్ష ద్వాదశి) నుండి చేయవలసిన క్రతువు. అదితి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించటం వలన, విష్ణువు ఆమెకు దర్శనమిచ్చి తను ఇంద్రునికి సహాయం చేస్తానని ఆమెకు తెలియజేసాడు.<br />
<br />
ఇంకొక ప్రక్క, దేవతలను ఓడించి మహాబలి ముల్లోకములకు పాలకుడు అవటంతో దేవతలందరూ చాలా చిరాకు పడ్డారు. దేవతలు హింసించబడ్డారు. దేవతలు విష్ణువును కలిసి సహాయం అర్ధించారు. మహాబలి తన ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు మరియు అతను సురుడు (దేవుడు) అవటానికి అర్హుడు అని విష్ణువు దేవతలతో చెప్పాడు. దేవతలారా మీరు దీని గురించి ఈర్ష్య చెందకండి. అసూయ మిమ్ములను అసురులుగా చేస్తుంది. విష్ణువు మహాబలిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు.<br />
<br />
అదే సమయంలో, మహాబలి నర్మదా నది ఒడ్డున విశ్వజిత్ యాగం లేదా అశ్వమేధ యాగం నిర్వర్తిస్తున్నాడు. ఈ యాగం సమయంలో తన వద్ద నుండి ఎవరు ఏమి కోరినా అది తను ఇస్తానని కూడా ఆయన ప్రకటించాడు.<br />
వామనుడు మహాబలిని కలుస్తాడు<br />
బలి చక్రవర్తి (మహాబలి, right seated) ఆస్థానములో భిక్ష కోరుతున్న వామనుడు (నీల వర్ణపు మోము కలిగిన పొట్టివాడు).<br />
<br />
ఆ యాగమును మరియు మహాబలి యొక్క ప్రకటనను అదునుగా తీసుకుని, వామనుడు (మహావిష్ణువు బ్రాహ్మణుడిగా మారువేషంలో) ఆ యాగశాల వద్దకు వచ్చాడు. అతను వారిని సమీపించగానే, అక్కడ ఉన్న ఋషులు ఆ చిన్నపిల్లవాని యొక్క దివ్యమైన తేజస్సును కనుగొన్నారు. మహాబలి ఆ బ్రాహ్మణ బాలుని సకల మర్యాదలతో స్వాగతించాడు మరియు ఒక దివ్య పురుషుని హోదాలో అతనిని ఉన్నతాసనములో కూర్చుండబెట్టాడు. సహాయం కోరుతూ వచ్చిన ప్రజలకు ఇచ్చే సాధారణ మర్యాదతో మహాబలి, వామనునితో ఆయన రాకతో తనను పావనం చేయటం తన అదృష్టమని చెప్పాడు. వామనుడు ఏది కోరుకుంటే, అది తీర్చటానికి మహాబలి సిద్ధంగా ఉన్నాడు. వామనుడు చిరునవ్వు నవ్వి ఈవిధంగా చెప్పాడు: "నువ్వు నాకు గొప్పది ఏదీ ఇవ్వనక్కరలేదు. నువ్వు నాకు మూడు అడుగుల భూమిని ఇస్తే చాలు" .<br />
<br />
అతని మాటలు విని, భవిష్యత్తును చూడగలిగిన, మహాబలి యొక్క గురువు అయిన శుక్రాచార్యుడు అనే బ్రాహ్మణుడు (ఒక దైత్య గురువు), మహాబలితో అతని వద్దకు భిక్ష కొరకు వచ్చిన వాడు సాధారణ బ్రాహ్మణుడు కాదని విష్ణువే ఈ రూపంలో వచ్చాడని చెప్పాడు. ఆ పిల్లవానికి ఏమీ వాగ్దానం చేయవద్దని ఆయన మహాబలికి సలహా ఇచ్చాడు. కానీ మహాబలి ఎప్పుడూ ఆడిన మాట తప్పే రాజు కాదు, అలా చేయటం పాపమని ఆయన ఉద్దేశ్యం. వామనుని కోరికలను తీర్చకూడదని, ఎందుకనగా వామనుడు అతని సంపదనంతటినీ హరించివేస్తాడని శుక్రాచార్యుడు గట్టిగా చెప్పాడు.<br />
సాంప్రదాయక దుస్తులలో ఉన్న ఒనపొట్టాన్, కేరళ ఉత్తర ప్రాతములలో ఒక ఆచారంఓనం సమయంలో ఒనపొట్టాన్ ఇంటింటికీ తిరిగి దీవెనలు అందిస్తాడు. ప్రస్తుతం ఒనపొట్టాన్ చాలా అరుదుగా అగుపిస్తున్నాడు, కేవలం గ్రామాలకే పరిమితమైనాడు.<br />
<br />
వామనుడుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్న మహాబలి, తన గురువు మాటను మన్నించనందుకు ఆయనను క్షమాపణ కోరుకున్నాడు. పూర్వం, మహాబలి ఇంద్రునిపై యుద్ధానికి దండెత్తి వెళుతున్నప్పుడు, తన గురువైన శుక్రాచార్యుని కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసాడు మరియు ఆయన సలహాపైనే విశ్వజిత్ యాగమును ప్రారంభించాడు, దీని నుండే అతను కొన్ని శక్తివంతమైన ఆయుధాలను సంపాదించాడు. కేవలం శుక్రాచార్యుని సహాయం వలనే అతను ఇంద్రుడిని జయించగలిగాడు. మహాబలి తిరస్కారం శుక్రాచార్యునికి ఆగ్రహం తెప్పించింది. ఆయన మహాబలిని ఈవిధంగా శపించాడు: 'నీ గురువు మాటలను లక్ష్య పెట్టనందుకు, నీవు బూడిద అయిపోతావు'. మహాబలి ధృడంగా ఉండి ఈ విధంగా సమాధానం చెప్పాడు: 'నేను ఏ విధమైన పరిణామములను ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ నా మాటను వెనక్కి తీసుకోను'.<br />
మహాబలి యొక్క ఏలుబడి ముగుస్తుంది<br />
<br />
ఆ విధంగా చెపుతూ, అతను వామనుడుని అతను కోరుకున్న మూడు అడుగుల భూమిని కొలవమని అడిగాడు. మహాబలిని వారించటానికి శుక్రాచార్యుడు చేసిన ప్రయత్నములన్నీ విఫలమయ్యాయి. తన వద్దకు సహాయం కొరకు వచ్చిన ప్రతిఒక్కరినీ దేవునిగానే మహాబలి భావించాడు మరియు వారు కోరినది ఏదీ అతను కాదనలేదు. మహాబలి తన గురువుతో ఈ విధంగా చెప్పాడు: "ప్రాణము (జీవం) మరియు మానము (మర్యాద) అనేవి మనిషికి రెండు కళ్ళ వంటివి. ప్రాణం పోయినా, మానం రక్షించబడాలి. ఇప్పుడు వచ్చిన వాడు దేవుడే అని తెలుసుకుంటే, మానవులకు అన్నీ ఇచ్చే భగవంతుడు, నా నుండి ఏదో ఆశిస్తున్నాడంటే, నేను చాలా అదృష్టవంతుడిని అవుతాను. " ఒకవేళ విష్ణువే తన క్రతువు వద్దకు వచ్చి ఏదైనా కోరుకుంటే, తను తప్పకుండా దానిని తీరుస్తానని కూడా మహాబలి గొప్పగా చెప్పాడు.<br />
<br />
బలిపై విజయం సాధించిన త్రి-విక్రమునిగా (ముల్లోక విజేత) వామనుడు<br />
వామనుడు ఆకాశము కన్నా ఎత్తుకు పెరిగిపోయాడు. ఒక్క అడుగుతో, అతను భూమినంతటినీ కొలిచాడు. రెండవదానితో ఆకాశమును కొలిచాడు. మహాబలి అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఇంకొక అడుగు భూమి ఇంకా మిగిలి ఉంది. వేరే దారి లేకపోవటంతో, మూడవ అడుగు భూమిగా ఆఖరి అడుగును తన తలపై ఉంచవలసిందని మహాబలి వామనుడిని అభ్యర్ధించాడు. వామనుడు అదే విధంగా చేస్తూ, అతనిని పాతాళానికి తొక్కి వేసాడు <br />
(భూమి క్రింద ఉన్న రాజ్యం).--విష్ణువు యొక్క దీవెనలు<br />
రాక్షసుడు అయిన మహాబలి భక్తికి మెచ్చి, విష్ణువు (వామనుడు) అతనికి పాతాళమును పాలించే వరం ఇచ్చాడు. ఒక మన్వంతరం అతను ఇంద్ర పదవిని అధిష్టించే వరం కూడా ఇచ్చాడు, ఆ విధంగా తన భక్తుని కోరికను నెరవేర్చాడు (ప్రతి మన్వంతరమునకు ఒకసారి ఇంద్ర పదవిని కొత్తవారు అధిష్టిస్తారు).<br />
<br />
ఆఖరి వరంగా, మహాబలి సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను కలుసుకునేందుకు అనుమతి కూడా పొందాడు. ఆవిధంగా, తన వాగ్దానమును నిలుపుకోవటానికి ప్రతి సంవత్సరము వచ్చే గొప్ప రాజు మహాబలి జ్ఞాపకార్ధం కేరళ ప్రజలు ఓనం పండుగను జరుపుకుంటారు. ఆడిన మాట ("సత్యము") కొరకు ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా మహాబలి తన పేరును సార్ధకం చేసుకున్నాడు. "మహాబలి" అనగా గొప్ప త్యాగము అని అర్ధం.<br />
<br />
ఓనం సమయంలో, విందు మరియు చక్కగా ముస్తాబైన ప్రజల యొక్క పండుగ ఉత్సాహం మహాబలి యొక్క మచ్చలేని పాలన సమయంలోని ప్రజల సుసంపన్నమైన మరియు నిజాయితీ అయిన జీవితానికి స్మృతిగా భావిస్తారు. ఓనం సమయంలో ప్రజలు కొత్త దుస్తులు (వస్త్రములు) ధరిస్తారు. 'వస్త్రము' అనగా హృదయము అని కూడా అర్ధం. ఆవిధంగా చెడ్డ ఆలోచనలను మరియు చెడ్డ భావములను తొలగించి హృదయమును నూతనముగా చేయటమే, కొత్త వస్త్రములు ధరించటం యొక్క ప్రాముఖ్యత. వారి మత అభిమానములను ప్రక్కన పెట్టి, ప్రజలందరూ కలిసికట్టుగా పవిత్రమైన 'తిరుఓనం' దినానికి స్వాగతం చెపుతారు.<br />
<br />
నైతిక ప్రశ్నలు<br />
తన తాత (ప్రహ్లాదుడు) లాగా, విష్ణువుకు గొప్ప భక్తులలో ఒకడు మరియు సత్యసంధుడైన ఒక గొప్ప రాజు అయిన మహాబలిని, విష్ణువు శిక్షించటం అన్యాయముగా అనిపించవచ్చు. అయినప్పటికీ, విష్ణువు మహాబలిని శిక్షించినట్లు కాదు, ఎందుకనగా అతను విష్ణువు నుండి వరములు పొందాడు మరియు ఓనం రూపంలో అతను శాశ్వతంగా గుర్తుంచుకోబడతాడు. ఇంకా అతని తన తలను విష్ణువు పాదముల క్రింద ఉంచే అవకాశం దొరికింది, దీనితో అతని పాపములు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి.<br />
<br />
ఇంకా, విష్ణువు ఇచ్చిన వరం వలన, మహాబలి ఎనిమిదవ మనువు, సావర్ణి మనువు సమయంలో, కాబోయే (ఎనిమిదవ) ఇంద్రుడు. పురందరుడు ప్రస్తుత ఇంద్రుడు.<br />
<br />
తన రాజ్యమును విష్ణువుకు త్యాగం చేయటం ద్వారా మహాబలి భూమండలంలో అతి గొప్ప విష్ణు భక్తుడు అయినాడని నమ్మకం.<br />
<br />
సురలు అనగా మంచివారు మరియు అసురులు అనగా చెడ్డవారు అని అర్ధం. హిందూమతం ప్రకారం, చెడ్డ పనులు చేయటం ద్వారా సురలు అసురులు అవవచ్చు మరియు మంచి పనులు చేయటం ద్వారా అసురులు సురలు అవవచ్చు. అసురుడైన మహాబలి, సురుడు అవాలని కోరుకున్నాడు. దాని కొరకు, అతను తన ప్రజలకు మంచి పనులు చేసాడు. మహాబలి యొక్క పరోపకారమును మరియు దాతృత్వమును పరీక్షించటానికి మహావిష్ణువు వామనుని రూపంలో వచ్చి అతనిని పాతాళమునకు పంపివేసాడు, దీనిని మహాబలి ఆనందముగా స్వీకరించాడు. ఆవిధంగా, మహాబలి సురుడు లేదా దేవుడు అయినాడు మరియు ఓనం హిందూమతం యొక్క అద్వైత సిద్ధాంతమును దృష్టాంతపరుస్తోంది.<br />
-----------------------------<br />
<br />
రాక్షస రాజైన బలి చక్రవర్తి ఓసారి భూమిని ఆక్రమిస్తాడు. దానవుల నుంచి మనుషులను కాపాడటానికి విష్ణుమూర్తి వైకుంఠాన్ని, లక్ష్మీదేవిని వదిలి భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణపౌర్ణమి రోజు బలి చక్రవర్తి చేతికి పవివూతదారాన్ని కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మనుషులకు విముక్తి కలిగిస్తాడు. విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.<br />
<ul>
<li>=====================================</li>
</ul>
Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/ </a>seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-31477197968497924282013-11-02T17:38:00.000-07:002013-11-02T17:38:07.618-07:00Pot desire - కుండ కోరిక<ul>
<li> </li>
</ul>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://3.bp.blogspot.com/-MidkmOybgUc/UnWaiXi_mhI/AAAAAAAAAXk/FgjBh-WvEsQ/s1600/Pot+desire.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="306" src="http://3.bp.blogspot.com/-MidkmOybgUc/UnWaiXi_mhI/AAAAAAAAAXk/FgjBh-WvEsQ/s320/Pot+desire.jpg" width="320" /></a></div>
<ul>
<li> <!--[if !mso]>
<style>
v\:* {behavior:url(#default#VML);}
o\:* {behavior:url(#default#VML);}
w\:* {behavior:url(#default#VML);}
.shape {behavior:url(#default#VML);}
</style>
<![endif]--></li>
</ul>
<!--[if gte mso 9]><xml>
<w:WordDocument>
<w:View>Normal</w:View>
<w:Zoom>0</w:Zoom>
<w:Compatibility>
<w:BreakWrappedTables/>
<w:SnapToGridInCell/>
<w:ApplyBreakingRules/>
<w:WrapTextWithPunct/>
<w:UseAsianBreakRules/>
</w:Compatibility>
<w:BrowserLevel>MicrosoftInternetExplorer4</w:BrowserLevel>
</w:WordDocument>
</xml><![endif]--><!--[if gte mso 10]>
<style>
/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:"Table Normal";
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-parent:"";
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin:0in;
mso-para-margin-bottom:.0001pt;
mso-pagination:widow-orphan;
font-size:10.0pt;
font-family:"Times New Roman";}
</style>
<![endif]--><!--[if gte mso 9]><xml>
<o:shapedefaults v:ext="edit" spidmax="1027"/>
</xml><![endif]--><!--[if gte mso 9]><xml>
<o:shapelayout v:ext="edit">
<o:idmap v:ext="edit" data="1"/>
</o:shapelayout></xml><![endif]-->
<br />
<div align="center" class="MsoNormal" style="text-align: center;">
<span lang="TE" style="color: red; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">కుండ</span><span lang="TE" style="color: red; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: red; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">కోరిక</span><span style="font-size: 10.0pt;"> <br />
</span><span style="font-size: 10.0pt;"></span></div>
<div align="center" class="MsoNormal" style="text-align: center;">
<br /></div>
<div class="MsoNormal">
<span lang="TE" style="color: red; mso-bidi-language: TE;">ఒ</span><span lang="TE" style="mso-bidi-language: TE;">క</span><span lang="TE"> </span><span lang="TE" style="mso-bidi-language: TE;">కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు. ఓర్పుతో</span>,
<span lang="TE" style="mso-bidi-language: TE;">నేర్పుతో మట్టి ముద్దలను</span><span lang="TE"> </span><span lang="TE" style="mso-bidi-language: TE;">కుండల ఆకృతిలో
మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు.</span><span lang="TE"> </span><span lang="TE" style="mso-bidi-language: TE;">అప్పటికే కాలుతున్న</span><span lang="TE"> </span><span lang="TE" style="mso-bidi-language: TE;">కొన్ని కుండలని చూసి పచ్చి కుండల్లో
ఒకదానికి చాలా భయం వేసింది.</span><span lang="TE"> </span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">'</span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">అమ్మో! ఒళ్లు</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">కాలిపోవడమే</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">? </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">వద్దు. దయచేసి
నన్ను కాల్చొద్దు. నన్నిలా వదిలెయ్. సుఖంగా</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">ఉన్న ప్రాణాన్ని
దుఃఖాన పెట్టకు. నాకు భయంగా ఉంది</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">' </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">అని కుమ్మరిని దీనంగా బతిమాలింది.</span><span lang="TE" style="font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">కుమ్మరి కుండతో</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> '</span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత
జీవితాంతం హాయిగా ఉండొచ్చు.</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే
నీ జీవితం వృథా అవుతుంది.</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావు</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">' </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">అంటూ ఎన్నో విధాల
నచ్చచెప్పాడు.</span><span lang="TE" style="font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">అతడు ఎంత</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">చెప్పినా
వినకుండా కుండ మొండికేసింది. సరే... అంతలా అడుగుతోంది పోనిమ్మని</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">కుమ్మరి ఈ కుండని
వదిలేసి మిగిలిన కుండలను ఆవంలో పెట్టాడు.</span><span lang="TE" style="font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">ఆవంలో కాలుతున్న</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ
తప్పినందుకు</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">,
</span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">ఆనంద
పడుతూ</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">, '</span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">నాకా</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">బాధలు లేవు</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">, </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">హాయిగా ఉన్నాను</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">' </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">అనుకుంది ఆ పచ్చి
కుండ.</span><span lang="TE" style="font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">బాగా కాలిన
ఎర్రని</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">, </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">నల్లని కుండలన్నీ
అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చి కుండ మాత్రం</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">ఆరుబయట ఆవరణలో
అలా ఉండిపోయింది.</span><span lang="TE" style="font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">కుమ్మరి ఒక</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">కుండలో నీళ్లు
నింపాడు. కొన్ని కుండీలలో మట్టి నింపి మొక్కలు నాటాడు.</span><span lang="TE" style="font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">తనకా బరువులు</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">లేనందుకు
ఆనందించిందా పచ్చి కుండ.</span><span lang="TE" style="font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">ఇలా ఉండగా ఓ</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">రోజు కుండపోతగా
వర్షం కురిసింది. కాల్చిన కుండలూ</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">, </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">కుండీలూ దృఢంగా</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లిగా కరిగి
మట్టిలో కలిసిపోసాగింది. తన</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">ఆకృతిని</span><span style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;">, </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">ఉనికిని కోల్పోయింది.</span><span lang="TE" style="font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">కుమ్మరి మాటల్లో</span><span lang="TE" style="color: black; font-family: Eenadu; font-size: 10.0pt;"> </span><span lang="TE" style="color: black; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">అంతరార్థం దానికి
చివరిక్షణంలో బోధపడింది. కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది.</span><span style="font-size: 10.0pt;"> </span></div>
<div align="right" class="MsoNormal" style="text-align: right;">
<i><span style="color: #000099; font-family: Eenadu; font-size: 10.0pt;">- </span></i><i><span lang="TE" style="color: #000099; font-family: Gautami; font-size: 10.0pt; mso-ascii-font-family: Eenadu; mso-bidi-language: TE; mso-hansi-font-family: Eenadu;">గుడిపూడి
రాధికారాణి</span></i><span style="font-size: 10.0pt;"></span></div>
<div class="MsoNormal">
<br /></div>
<br />
<ul>
<li>=====================================</li>
</ul>
Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/" target="_blank">Dr.Seshagirirao.com/ </a>seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-64793290156182942072010-10-13T07:27:00.000-07:002014-09-23T19:26:56.755-07:00ఆభరణం ఎవరిది?తెలుసుకోవడం ఎలా ?, How to know the looser?<ul>
<li><br /></li>
</ul>
<ul>
<li><a href="http://3.bp.blogspot.com/_aMUuyxDdRt4/TLXESJEDoWI/AAAAAAAAChM/h_Pq32X7HPk/s1600/Who+is+the+looser.jpg" onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}"><img alt="" border="0" src="http://3.bp.blogspot.com/_aMUuyxDdRt4/TLXESJEDoWI/AAAAAAAAChM/h_Pq32X7HPk/s400/Who+is+the+looser.jpg" id="BLOGGER_PHOTO_ID_5527539933616775522" style="cursor: pointer; height: 319px; width: 284px;" /></a></li>
<li><br /></li>
</ul>
<br />
సిరిపురం శివాలయంలోని వటవృక్షం కింద ఓ సాధువు, తన శిష్యుడితో బస చేశాడు. రోజూ సాయంత్రం ఆలయానికి వచ్చే భక్తులకు పురాణ పఠనం చేస్తూ ప్రసంగాలు ఇవ్వసాగాడు.<br />
<br />
ఓరోజు భక్తులందరూ వెళ్లిపోయిన తర్వాత ఆవరణను శుభ్రం చేస్తున్న శిష్యుడికి చీకట్లో ఏదో తళతళలాడుతూ కనిపించింది. దీపం వెలుగులో చూసేసరికి అదొక బంగారు హారం. శిష్యుడు దాన్ని గురువుకి చూపించాడు.<br />
<br />
'ఎవరో భక్తురాలు పోగొట్టుకుని ఉంటుంది. రేపు అందజేద్దాం' అన్నాడు సాధువు.<br />
<br />
'అంతమందిలో దీన్ని పోగొట్టుకున్నదెవరో తెలుసుకోవడం ఎలా స్వామీ?' అన్నాడు శిష్యుడు. సాధువు నవ్వి ఊరుకున్నాడు. మర్నాడు ప్రసంగం పూర్తవగానే సాధువు, 'భక్తులారా! నిన్న ఇక్కడెవరో ఓ విలువైన బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్నారు. పరిశీలించి చూడగా ఆ వ్యక్తి తీవ్రమైన గ్రహదోషంతో ఉన్నట్టు నా దివ్యదృష్టికి గోచరించింది. ఆ దోషం పోవాలంటే సుమారు యాభై వేల వరహాలు ఖర్చు చేసి యాగం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి వస్తే ఆ యాగాన్ని నేనే నిర్వహించగలను' అంటూ జోలెలో దాచిన ఆభరణాన్ని పైకి తీసి చూపించాడు.<br />
<br />
భక్తులందరూ దాన్ని చూశారు. ఇంతలో ఓ మహిళ కంగారుగా సాధువు దగ్గరకి వచ్చి, 'స్వామీ! అది నాదే. నగ సంగతలా ఉంచి నా గ్రహదోషం పోవడానికి చేసే ఆ యాగానికి ఏం కావాలో సెలవీయండి' అంది.<br />
<br />
సాధువు ఆమెను భక్తులంతా వెళ్లిపోయే వరకూ వేచి ఉండమని చెప్పి ఆభరణాన్ని ఇచ్చేశాడు. ఆపై కాసేపు కళ్లు మూసుకుని ధ్యానించి, 'నువ్వేమీ కంగారు పడకమ్మా! నీ గ్రహస్థితి మారింది. నువ్వే యాగాలూ చేయక్కర్లేదు' అన్నాడు. ఆమె సంబరంగా వెళ్లిపోయింది.<br />
<br />
శిష్యుడు ఆశ్చర్యంగా సాధువుని సమీపించి, 'అదేంటి స్వామీ! యాభై వేల వరహాల యాగం చేయక తప్పదని చెప్పిన గ్రహస్థితి ఒక్కసారిగా ఎలా మారిపోతుంది?' అన్నాడు.<br />
<br />
సాధువు నవ్వి, 'బంగారం ఆశను రేకెత్తిస్తుంది నాయనా! ఇదెవరిదో చెప్పండంటే చాలా మంది నాదంటే నాదని ఎగబడేవారు. అందుకే పదివేల వరహాల ఆభరణానికి యాభై వేల యాగాన్ని అడ్డం వేశాను. ఆ నగ నిజంగా ఎవరిదో తెలుసుకోడానికే అలా చెప్పాను' అన్నాడు సాధువు నవ్వుతూ.<br />
- ఆరుపల్లి గోవిందరాజులు<br />
<br />
<br />
<ul>
<li>============================================</li>
</ul>
Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/">Dr.Seshagirirao.com/</a>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-79144890184985786672010-10-13T06:43:00.000-07:002013-11-02T17:45:18.473-07:00చంద్రుడు--పదహారు కళలు , Moon and sixteen colors<ul>
<li><br /></li>
</ul>
<ul>
<li><a href="http://2.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLW5yJeWKnI/AAAAAAAAACA/XE00c269Dy4/s1600/Moon+and+brightness.jpg" onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}"><img alt="" border="0" id="BLOGGER_PHOTO_ID_5527528388854950514" src="http://2.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLW5yJeWKnI/AAAAAAAAACA/XE00c269Dy4/s400/Moon+and+brightness.jpg" style="cursor: pointer; height: 297px; width: 314px;" /></a></li>
<li><br /></li>
</ul>
<br />
<br />
చంద్రుడు దేవతలందరిలోకీ అందగాడు. చల్లని వాడు. పదునాలుగు లోకాల వారికీ ఇష్టుడు.<br />
అశ్విని మొదలైన ఇరవై ఏడుగురు నక్షత్ర కన్యలు దక్షప్రజాపతి కుమార్తెలు. వాళ్లందరూ అందగత్తెలే.<br />
వాళ్లందరినీ దక్షుడు చంద్రుడికిచ్చి వివాహం కావించాడు. చంద్రుడు వాళ్లందరినీ అనురాగంతోనే చూశాడు. కానీ, రోహిణిపైన మాత్రం కొంచెం ఎక్కువ స్నేహం కనబరిచాడు. అదిచూసి మిగతా వారు అసూయ చెంది, లోలోపల కుమల సాగారు. వారందరూ కలిసి పుట్టింటికి వెళ్లి తమ దౌర్భాగ్యాన్ని తండ్రితో చెప్పుకొని కంటనీరు పెట్టుకున్నారు. దక్షుడు వారి పట్ల జాలిపడి, చంద్రుణ్ని తన ఇంటికి పిలిచి తన కుమార్తెలందరిపట్ల సమానమైన ఆదరం కనబరచవలసిందని హితవు చెప్పి పంపాడు. కానీ చంద్రుడు తన పక్షపాతాన్ని మానుకోలేకపోయాడు.<br />
దక్షుడు ఆగ్రహం చెంది, అల్లుడని కూడా ఆలోచించక, చంద్రుడికి క్ష్యయవ్యాధి కలగాలని శపించాడు. ఆ కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించిపోసాగాడు. అతని నుండి వెన్నెల వర్షించటం ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. రాత్రులు గాఢాంధకారంతో నిండి, భయంకరంగా మారాయి. ఆ చీకటిలో రాత్రించరులైన రాక్షసులు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభించారు. లోకాలకు ఉల్లాసం కలిగించే చంద్రుడు అలా నానాటికీ కృశించిపోవటం చూసి ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు దుఃఖించి, చంద్రుణ్ని పిలుచుకొని బ్రహ్మ వద్దకు వెళ్లి, చంద్రుడికి రోగ విముక్తి కలిగించమని ప్రార్థించారు. బ్రహ్మ చంద్రుడితో, 'సుధాకరా! నువ్వు ప్రభాస క్షేత్రానికి వెళ్లి మృత్యుంజయుడైన పరమ శివుణ్ని గూర్చి తపస్సు చెయ్యి. దానివల్ల నీ క్షయవ్యాధి పోయి విశ్వశాంతి ఏర్పడగలదు' అన్నాడు.<br />
చంద్రుడు బ్రహ్మ చెప్పిన విధంగా ఆరు మాసాలపాటు తపస్సు చేశాక, ఈశ్వరుడు భవానీ సమేతంగా ప్రత్యక్షమై, 'వత్సా! దక్షశాపం వల్ల కృశించిపోతున్నానని విచారపడకు. నీకు కృష్ణ పక్షంలో ప్రతిరోజూ ఒక్కొక్క కళ క్షీణిస్తుంది. ఈ విధంగా నువ్వు నెలకొకసారి పూర్ణ చంద్రుడివై ప్రకాశిస్తావు' అని వరమిచ్చాడు. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల చంద్రుడికి పదహారు కళలు లభించాయి. సకల ప్రాణులకూ సంతోషం కలిగింది.<br />
-పునఃకథనం: కలువకొలను సదానంద<br />
<br />
<br />
<br />
<ul>
<li>============================================</li>
</ul>
<br />
Visit my Website at - ><a href="http://dr.seshagirirao.tripod.com/"> Dr.Seshagirirao.com/</a>seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-42975904755138553132010-10-11T17:26:00.000-07:002010-10-11T18:21:55.244-07:00మన శాంతమే మనకు రక్ష , Our peace is our protection<ul><li><br /></li></ul><ul><li><a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLO3R3OvHCI/AAAAAAAAABw/AyvTuZsaTds/s1600/peace+is+protection.jpg"><img style="cursor: pointer; width: 299px; height: 224px;" src="http://4.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLO3R3OvHCI/AAAAAAAAABw/AyvTuZsaTds/s400/peace+is+protection.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5526962685225147426" border="0" /></a></li><li><br /></li></ul>మానవ జీవితం ఒక విశిస్టమైనది . పంచభూతాలతో నిర్మితమైన ఈ జీవికి పంచావసరాలు ఉంటాయి . గాలి , నీరు , ఆహారము , నిద్ర , మైధునము . వీటిలో ఏ సమయానికి అవి ఉండాలి ... లేనిచో పలు బాధలకు లోనై మనుగడే ప్రశ్నార్ధకము . ఇవి కాకుండా అరిషట్గుణాలకు లోనవుతూ ఉంటాడు మానవుడు . కామ , క్రోధ , మోహ ,లోబ , మధ , మాత్సర్యాలు వలన విలువల్ని కోల్పోతుంటాదు .<br />శాంతము , క్రోధము ఒకదానికొకటి వ్యతిరేకము . ఒకటి మంచి వేరొకటి చెడు .<br /><ul><li> తన కోపమె తన శత్రువు,</li><li> తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ</li><li> తన సంతోషమె స్వర్గము,</li><li> తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ</li></ul>పురాణ కథలు .:<br />కైక తండ్రి అయిన కేకయరాజు ఒక రోజు అడవికి వెళ్ళి మగలేడిని బాణము తో కొట్టి వంపగా ... ఆడాలేడి తన తల్లికి పెప్పుకుంది . అప్పుడు ఆ తల్లి లేడి మందర అనే పేరు తో మానవ స్త్రీగా పుట్టి తన అల్లుడిని చంపాడానే క్రోధం తో (పుట్టింది గనుకనే) కైకకు దాసీ గా ఉండి మాయమాటలు చెపి కేకయరాజు యొక్క అల్లుడైన దశరధుడు చనిపోయేటట్లు చేసింది . ఈ కథ వలన తెలిసిందేమిటంటే ... ఎవరికీ విరోధులం కాకూడదు , విరోధులమయ్యే పనులు చేయకూడదూ అనే నీతిని గ్రహించాలి .<br /><ul><li><a href="http://3.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLO4Cp23ZjI/AAAAAAAAAB4/477Kq5ufZ-s/s1600/peace+Aruna+going+for+bhisma+killing.jpg"><img style="cursor: pointer; width: 238px; height: 184px;" src="http://3.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLO4Cp23ZjI/AAAAAAAAAB4/477Kq5ufZ-s/s400/peace+Aruna+going+for+bhisma+killing.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5526963523448956466" border="0" /></a></li></ul>అర్జునుడు యుద్ధం లో భీష్మాచార్యుడుని చంపాడు గనుక ... భీష్ముని తల్లి గంగ కు క్రోధం కలిగింది . అర్జునుడు ఆరుమాసాలలో చచ్చుగాక అని శపించినది . జ్వాలాదేవి అర్జునుడు తన కుమారున్ని చంపాడన్న క్రోధం తో అర్జునుని కుమారుడైన బభ్రువాహనుని చేతిలో బాణం గా పుట్టి అర్జునుని తలను త్రుంచేసింది . తరువాత శ్రీకృష్నుడు అర్జునుడిని బ్రతికించాడు .<br /><br />అంబ భీష్మాచార్యుల పై కోపము తో శిఖండి గా పుట్టి భీష్ముని చావుకి కారణమయినది .<br /><br />శ్రీ రాముడు వాలిని చంపడం వల్ల వాలి క్రోధం తో మరుజన్మలో రాముడు ... శ్రీకృష్ణుడు గా పుట్టిన తర్వాత '' వాలి కిరాతుడిగ పుట్టి శ్రీకృష్ణుడుని బాణము తో కొట్టి చంపాడు .<br /><br />పై వన్నీ క్రోధం ఫలితాలే . క్రోధం తో ఇలా మరల మరల పుడుతూ పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కంటే ... క్రోధం కలిగే పనులు చేయకుండా నుంటే ఎంతో మేలు .<br /><br /><ul><li>============================================</li></ul>Visit my Website at - ><a href="http://dr.seshagirirao.tripod.com/"> Dr.Seshagirirao.com/</a>seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-8015821851853410712010-10-11T16:56:00.000-07:002010-10-11T17:24:59.480-07:00ఆహరం తెలిసి తింటే ఏ రోగం రాదు , Eat food by knowing about it<ul><li><br /></li></ul><ul><li><a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLOqeeZ_-NI/AAAAAAAAABg/0zII2WzyIaQ/s1600/Stree+Loludu+Three+brothers.jpg"><img style="cursor: pointer; width: 304px; height: 254px;" src="http://2.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLOqeeZ_-NI/AAAAAAAAABg/0zII2WzyIaQ/s400/Stree+Loludu+Three+brothers.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5526948608248641746" border="0" /></a></li><li><br /></li></ul>స్త్రీ సుఖి, భోజనసుఖి, నిద్రాసుఖి అను వారి కథ --వ్యవహారం తెలిసి మాట్లాడితే తగాదా లేదు -- ఆహారం తెలిసి తింటే ఏ రోగం రాదు<br /><br />వంగాదేశమున భూషణుడను ఉండెను. అతనికి ముగ్గురు కొడుకులు కలిగిఉండెను. ఆ బ్రాహ్మణుడు ఒక యాగము చేయదలచి తన పుత్రులను పిలిచి మీరు సముద్రమునకు వెళ్లి యొక కూర్మమును తీసుకొనిరండని చెప్పి పంపెను.<br /><br />ఆ ముగ్గురు సముద్రమునకు వెళ్లి ఒక కూర్మమును చూచి తమ్ముని పిలిచి దానిని ఎత్తుకొని రమ్మని చెప్పగా వాడు నేను భోజన సుఖిని కనుక ఎత్తజాలనని తెలిపిను. రెండవవానిని యొత్తమనగా వాడు నేను స్త్రీ భోగిని కావున ఎత్తడములేదని చెప్పెను. జ్యేష్ఠుడు నేను నిద్రాసుఖిని కనుక ఎత్తనని పలికెను.<br /><br />ఈ విధముగా వారు తగవుపడి, విజయనగరమనే పట్టణమునకుపోయి, ఆ పట్టణము నేలుచున్న ప్రతాపుడను రాజువద్ద తమ వాజ్యామును చెప్పుకొనిరి.<br /><br />అప్పుడు ఆ రాజు వారి సామర్ధ్యమును తెలుసుకొనవలెనని భావించి ఒక స్త్రీని పిలిపించి, వేలగాక వస్త్రభూషణములు ధరింపజేసి స్త్రీ భోగి వద్దకు పంపగానే వాడు ఆ స్త్రీని చూచి, ముక్కు మూసుకొని నీవద్ద దుర్వాసన కలదు వెంటనే వెళ్ళిపొమ్మని పంపివేసెను. ఆ సంగతి రాజు తెలుసుకొని, దాని తల్లిని పిలిపించి ఆ స్త్రీ పూర్వచరిత్ర తెలుపుమనియడుగాగా "ఇది నా చెల్లెలి కూతురు. ఇది పుట్టిన ఐయిదు దినములకే నా చెల్లెలు మరణించినది. అప్పుడు నుంచి దేనికి మేకపాలు పట్టించి పెంచితిని. కావున దీని శరీరము దుర్వాసన కలిగిఉన్నది" అని చెప్పెను.<br /><br /><ul><li><a href="http://2.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLOqehRiAhI/AAAAAAAAABo/svfgxSYLGeA/s1600/Stree+LoluDu.jpg"><img style="cursor: pointer; width: 249px; height: 242px;" src="http://2.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLOqehRiAhI/AAAAAAAAABo/svfgxSYLGeA/s400/Stree+LoluDu.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5526948609018429970" border="0" /></a></li></ul>తరువాత రాజు మదురమైన పదార్ధము వండించి భోజనసుఖిని పిలిపించి భోజనం చేయమనగా, వాడు ఆ యన్నమును చూచి పీనుగుకంపు కొట్టుచున్నదని పలికి వదిలిపెట్టెను. రాజు ఆ సంగతి విచారించగా, ఆ యన్నము శ్మశానము దగ్గరనున్న భూమిలో పండించిన వడ్లబియ్యముతో వండిచినందున అట్టి వాసన కలిగినదని గ్రహించెను.<br /><br />పిమ్మట ఆరాజు ఒక మృదువైన పరుపును తయారుచేయించి, నిద్ర సుఖ్ని పిలిచి దానిపై పరుండుమని చెప్పగా, వాడా పరుపుపై పవళించి వెంటనే పైకి లేచిపోయెను. అలా ఎందుకు చేసితివి అని రాజు అడుగగా ఆ పరుపులో ఒక వెంట్రుక ఉన్నది అది ఒత్తుకొనుటచే లేచితిని అని చెప్పెను. రాజు ఆ పరుపును విప్పించి చూడగా దానియందు రోమముండెను.<br /><br />రాజు వారు ముగ్గురు చెప్పిన విషయములు విని, వారికిగల సామర్ధ్యమునకు సంతోషించి తగు బహుమతులు ఇచ్చి గౌరవించెను. ఓ విక్రమాదిత్య మహారాజా! ఆ ముగ్గురిలో ఎవరు అధిక సుకుమారులు?" అని ప్రశ్నించగా, విక్రమాదిత్యుడు "భోజన సుఖి, స్త్రీ సుఖి బుద్దిచేత గ్రహించి చెప్పిరి. నిద్రాసుఖి పరుపులోనున్న వెంట్రుక వలన కలిగిన దద్దు వాని శరీరమున కానవచ్చెను. కావున వాడే సుకుమారి" యని చెప్పెను. అది విని భేతాలుడు సంతోషించి, మరల పారిపోయి వృక్షంనెక్కి ఎప్పటి వలె యుండెను.<br /><br /><br /><br />భేతాలుని కథలు<br /><ul><li>============================================</li></ul>Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/">Dr.Seshagirirao.com/</a>seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-53515408825991357752010-10-09T23:37:00.000-07:002014-09-23T08:07:03.252-07:00లంక చేరని ఆత్మలింగం , Shiv Linga not reached Lanka<ul>
<li><br /></li>
</ul>
<ul>
<li><a href="http://1.bp.blogspot.com/_VzyqniMCeAU/TLFgW0uOz9I/AAAAAAAAOic/PDmzeMhiyE8/s1600/Ravana+lifting+shivLing.jpg" onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}"><img alt="" border="0" src="http://1.bp.blogspot.com/_VzyqniMCeAU/TLFgW0uOz9I/AAAAAAAAOic/PDmzeMhiyE8/s400/Ravana+lifting+shivLing.jpg" id="BLOGGER_PHOTO_ID_5526304162986250194" style="cursor: pointer; height: 391px; width: 286px;" /></a></li>
<li><br /></li>
</ul>
పురాణ కథ - లంక చేరని ఆత్మలింగం : లంకాధీశ్వరుడైన రావణుడు శివభక్తులలో అగ్రగణ్యుడు. అతడు హిమాలయాలకు వెళ్లి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. రావణుడు 'పరమేశ్వరా! నువ్వు నా లంకానగరానికి వచ్చి, అక్కడ నిత్య నివాసం చెయ్యి' అని కోరాడు.<br />
శివుడు తన ప్రతీక అయిన ఆత్మలింగాన్ని అతనికి ప్రసాదించి, 'ఈనా ఆత్మలింగాన్ని ఎక్కడ ప్రతిష్టించితే, నేను అక్కడ ఉంటాను. దీనిని తీసుకుపో! లంకానగరం చేరే వరకు పొరబాటుగానైనా దీనిని కింద పెట్టకు. ఇది కిందపడితే, మళ్లీ లేవనెత్తటం అసాధ్యం' అని హెచ్చరించాడు.<br />
ఈ విషయం తెలిసి దేవతలు హడలి పోయారు. శివుడికి లంకలో నిత్యనివాసం ఏర్పడితే, రావణాసురుణ్ణి జయించే వాళ్లు ఎవరూ ఉండరు. లంకమీదికి దండెత్తే సైన్యాలను శివుడే చంపుతాడు. కనుక ఆత్మలింగం లంకకు చేరటం దేవతలకు ఇష్టంలేక పోయింది. ఈ ఆపద తొలగటానికి వాళ్లు గణపతిని పూజించారు.<br />
గణపతి తన మాయతో రావణుని మార్గంలో మనుష్యులెవరూ లేకుండా చేసి తాను గోప బాలకుడి వేషంలో వెళ్లి సముద్రతీరంలో ఒక చోట పశువులను మేపుకోసాగాడు. ఆత్మలింగాన్ని చేత బట్టుకొని రావణుడు అక్కడికి రాగానే, సాయంకాలమైంది. రావణుడు బ్రహ్మజ్ఞాని. త్రిసంధ్యలలోను సంధ్యవార్చుకొనే నియమం కలవాడు. ఆత్మలింగాన్ని కిందపెట్టి వెళ్లి సంధ్య వార్చుకోవటం కుదరదు కనుక, సహాయం కోసం చుట్టూ చూడగా, గోప బాలకుడు అతనికి కానవచ్చాడు. రావణుడు అతన్ని పిలిచి కొద్దిసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని, తాను సంధ్యవార్చి తిరిగి వచ్చేవరకు కిందపెట్టవద్దనీ చెప్పాడు.<br />
గణపతి దానిని తీసుకొని 'ఇది చాలా బరువుగా ఉంది. దీనిని మోసుకొని ఉండటం నాకు కష్టమైపోతే మూడుసార్లు నిన్ను పిలుస్తాను. ఆలోగా వచ్చి దీనిని అందుకో. నువ్వు రాకపోయావో తప్పు నాది మాత్రం కాదు' అన్నాడు. రావణుడు అందుకు సమ్మతించి, సముద్ర స్నానానికి వెళ్లాడు. అతడు సంధ్య వార్చుకోక ముందే గణపతి 'రావణా! త్వరగారా!' అంటూ మూడుసార్లు పిలిచాడు.<br />
రావణుడు, 'ఇదిగో వచ్చేస్తున్నాను' అంటుండగానే గణపతి 'ఇక నావల్లకాదు, అని చెప్పి, లింగాన్ని భూమిపైన పెట్టి మాయమయ్యాడు. రావణుడు పరుగు పరుగున వచ్చి, భూమిలో కూరుకుపోయిన లింగాన్ని లేవనెత్తటానికి విశ్వప్రయత్నం చేశాడు. అతని బలానికి భూమి కంపించింది కానీ ఫలితం మాత్రం లేకపోయింది. తన ప్రయత్నమంతా నిష్ఫలమైనందుకు రావణుడు దుఃఖించి, ఆకాశవాణి ప్రబోధం మేరకు, అక్కడొక తటాకాన్ని నిర్మించి, సకల తీర్థాలలోని పవిత్ర జలాలను అందులోకి రప్పించి, ఆ జలాలతో లింగాన్ని అభిషేకించి, పూజించి, లంకకు మరలివెళ్లాడు.<br />
అతని ప్రయత్నం భగ్నం అయినందుకు దేవతలంతా సంతోషించారు.<br />
<br />
-పునఃకథనం: కలువకొలను సదానంద-Eenandu news paper<br />
<br />
ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం <br />
<br />
మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.<br />
<br />
పురాణ కథ<br />
<br />
ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ, మహాభారతాలలో చూడగలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం, రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.<br />
<br />
అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు, కాసేపు ఆత్మలీంగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్ధిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు, తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు, గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు.<br />
<br />
ఇంకొక కథనం ప్రకారం, పాతాళలోకంలో తపస్సు చేసి, భూలోకానికి వస్తున్నప్పుడు, భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రనికి గో (ఆవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందట.<br />
<br />
పురాతన ప్రాశస్త్యం<br />
<br />
దక్షిణకాశి, భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్రచరిత్ర ఎంతో పురాతనమైనది. కాళిదాసు, తన 'రఘువంశం' కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు 'నాగానంద' కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు - కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు. క్రీ.శ. 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసాడట.<br />
<br />
కోటితీర్థం<br />
<br />
గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది. ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం ఇరవైనాలుగు గంటలూ తెరువబడే ఉంటుంది.<br />
<br />
మహాబలేశ్వరాలయం<br />
<br />
పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడనికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. ఈ శివపూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తూంటారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. ఇక, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడురోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి, భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.<br />
<br />
తామ్రగౌరీ ఆలయం<br />
<br />
మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.<br />
<br />
మహాగణపతి ఆలయం<br />
<br />
రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చారుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహనం ఒకటిన్నరవరకు, సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదింపావు వరకు ఆలయం తెరిచి ఉంటుంది.<br />
<br />
ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి.<br />
<br />
గోకర్ణంలో బస చేసేందుకు హోటళ్ళ సౌకర్యం బాగానే ఉంది. గోకర్ణం బెంగుళూరు నుంచి సుమారు 450 కి.మీ దూరంలో ఉంది. హబ్లి, ఉడుపి, మంగళూరు, బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌక్యం ఉంది. కొంకణీరైలు మార్గంలో గోకర్ణరోడ్డు స్టేషన్కి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది.<br />
<br />
గోకర్ణానికి చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు<br />
<br />
ధారేశ్వర ఆలయం<br />
<br />
ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణదిక్కున సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయిసల శిల్పశైలిలో కనబడుతుంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిగంటల వరకు తెరచి ఉంటుంది.<br />
<br />
గుణవంతేశ్వర ఆలయం<br />
<br />
ఈ ఆలయం కూడ గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇది గోకర్ణం నూంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచిఉంటుంది.<br />
<br />
మురుడేశ్వర ఆలయం<br />
<br />
పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడ ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఆరు గంటల నుండి తెరచి ఉంటుంది.<br />
<br />
మూలము : భక్తిసుద (bhaktisudha.com)<br />
<br />
<br />
<br />
<br />
<br />
<ul>
<li>============================================</li>
</ul>
Visit my Website at - > <a href="http://dr.seshagirirao.tripod.com/">Dr.Seshagirirao.com/</a>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8168281406130396253.post-1467041778574610552010-10-09T19:05:00.000-07:002013-11-02T17:46:57.239-07:00Yamudu son Yamaha , యముడి కొడుకు యమహా.<ul>
<li><br /></li>
</ul>
<ul>
<li><a href="http://3.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLEga10UGxI/AAAAAAAAAA4/G0GrbarXr3I/s1600/Yama+son+Yamaha.jpg" onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}"><img alt="" border="0" id="BLOGGER_PHOTO_ID_5526233863255497490" src="http://3.bp.blogspot.com/_ML-VnYbDwTE/TLEga10UGxI/AAAAAAAAAA4/G0GrbarXr3I/s400/Yama+son+Yamaha.jpg" style="cursor: pointer; height: 362px; width: 400px;" /></a></li>
<li><br /></li>
</ul>
కథ -- యముడి కొడుకు యమహా!<br />
ఓసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది. వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాళి. పెళ్లయిన మర్నాటి నుంచే చీటికీ మాటికీ అతడిని సాధించేది. ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు. కొన్నాళ్లకు వారికో ఓ కొడుకు పుట్టాడు.<br />
<br />
కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్యంటే మొహం మొత్తింది. ఆమె గొంతు వింటేనే కంపరం పుట్టుకొచ్చేది. ఇక ఎంత మాత్రం ఆమెను భరించలేనని నిర్ణయించుకున్న యముడు తన కొడుకును దగ్గరకు పిలిచి జరిగిందంతా చెప్పి, 'ఇక నాకు ఈ జీవితంపై విరక్తి కలిగింది. నా కొడుకుగా నీకొక గొప్ప రహస్యం చెబుతా. నువ్వు వైద్య వృత్తిని ప్రారంభించు. నువ్వు ఏ రోగిని చూసినా అతడికి నయం అయ్యేటట్టు వరమిస్తున్నా. అయితే ఏ రోగి తల దగ్గరైనా నేను కనిపిస్తే మాత్రం వైద్యం చేయకు. ఎందుకంటే వాళ్ల చావు తప్పదన్నమాట' అంటూ అదృశ్యమైపోయాడు. తండ్రి చెప్పినట్టే ఆ యువకుడు వైద్యవృత్తిని చేపట్టి గొప్ప హస్తవాశి కలవాడుగా పేరుపొందాడు. ఓసారి ఆ దేశపు రాకుమారికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడింది. పెద్ద పెద్ద వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. రాజు వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించి రాకుమారి జబ్బు తగ్గించినవారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తానంటూ ప్రకటించాడు.<br />
<br />
ఆ ప్రకటన విన్న యువకుడు ఉత్సాహంగా రాజధాని బయల్దేరి రాకుమారిని చూశాడు. ఆమెను పరీక్షిస్తూ చుట్టూ చూసేసరికి తలదగ్గర తండ్రి కనిపించాడు. ఆమె చనిపోక తప్పదని అతడికి అర్థం అయింది. రాకుమారిని రక్షిస్తే జీవితాంతం సుఖంగా బతకవచ్చనుకున్న యువకుడికి ఏం చేయాలో తోచలేదు. కాసేపు ఆలోచించిన అతడికి ఓ ఉపాయం తోచింది. వెంటనే గది గుమ్మం వరకూ పరిగెత్తి బయటకి చూస్తూ, 'అమ్మా! త్వరగా రా. నాన్నగారు ఇక్కడే ఉన్నారు' అంటూ అరిచాడు.<br />
<br />
కొడుకు కేక వినగానే యమభటుడికి చెమటలు పట్టాయి. గయ్యాళి భార్యను చూడవలసి వస్తుందనే భయంతో చటుక్కున అదృశ్యమైపోయాడు. దాంతో ఆ యువకుడి వైద్యం ఫలించింది. రాకుమారిని పెళ్లాడి, రాజవ్వాలన్న అతడి ఆశ కూడా నెరవేరింది!<br />
<br />
Courtesy Eenadu news paper<br />
-మేకల మదన్ మోహన్ రావు<br />
<ul>
<li> =========================================</li>
</ul>
visit my Web-blog -> <a href="http://dr.seshagirirao.tripod.com/">Dr.Seshagirirao.com/</a>seshagirirao_vandana@yahoo.comhttp://www.blogger.com/profile/14369516116540521978noreply@blogger.com0